News January 26, 2025
రోజా.. ఐదేళ్లు రాష్ట్రానికి మీరేం చేశారు?: మంత్రి దుర్గేశ్

AP: Dy CM పవన్ కళ్యాణ్ను CM చంద్రబాబు దావోస్కు ఎందుకు తీసుకెళ్లలేదంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి రోజాపై మంత్రి కందుల దుర్గేశ్ మండిపడ్డారు. క్యాబినెట్ మొత్తాన్ని ఎవరూ దావోస్ తీసుకెళ్లరని అన్నారు. ‘పవన్ గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి ఆమె ఏం చేశారు? రిషికొండపై జగన్ భవనాలు కడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దాని వల్ల పర్యాటక శాఖ నష్టపోయింది’ అని విమర్శించారు.
Similar News
News December 7, 2025
10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తాం: యజమానుల సంఘం

AP: ఎల్లుండి (డిసెంబర్ 9) అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయించింది. 13 ఏళ్లు దాటిన గూడ్స్ వాహనాలపై కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్నెస్ <<18452599>>ఛార్జీలను<<>> వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. అదనపు ఫీజుల భారం సరుకు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. డిమాండ్లను పట్టించుకోకపోతే రైల్వే షెడ్లు, షిప్యార్డుల్లో 10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
News December 7, 2025
10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తాం: యజమానుల సంఘం

AP: ఎల్లుండి (డిసెంబర్ 9) అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయించింది. 13 ఏళ్లు దాటిన గూడ్స్ వాహనాలపై కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్నెస్ <<18452599>>ఛార్జీలను<<>> వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. అదనపు ఫీజుల భారం సరుకు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. డిమాండ్లను పట్టించుకోకపోతే రైల్వే షెడ్లు, షిప్యార్డుల్లో 10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
News December 7, 2025
సేంద్రియ ఎరువులతో సాగుకు లాభం

సేంద్రియ ఎరువులు నేల భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తాయి. మొక్కలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు తగిన మోతాదులో అందుతాయి. సేంద్రియ పదార్ధాలు భూమిలో మరింత మార్పుచెంది హ్యూమస్ అనే విలువైన పదార్థం తయారవుతుంది. ఇది పోషకాలను అధికంగా పట్టిఉంచి మొక్కకు సమర్ధవంతంగా అందిస్తుంది. సేంద్రియ ఎరువుల వాడకంతో నేలలో మొక్కలకు హాని కలిగించే శిలీంధ్రాలు, నులిపురుగుల ఉద్ధృతి, చీడపీడల తాకిడి తగ్గుతుందంటున్నారు నిపుణులు.


