News November 29, 2024
ఆశ్రమ పాఠశాలలో కుళ్లిన గుడ్లు, బంగాళదుంపలు

TG: ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ఆశ్రమ పాఠశాలలో తనిఖీలు చేయగా కుళ్లిన గుడ్లు, ఆలుగడ్డలు కనిపించాయి. పప్పునకు బదులు సాంబార్ వండారని, ఉప్పు ప్యాకెట్లపై ISI మార్క్ లేదని గుర్తించారు. విద్యార్థులకు బ్లాంకెట్లు, యూనిఫామ్ ఇంకా అందలేదని తెలియడంతో వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


