News September 10, 2025
రెస్టారెంట్లో కుళ్లిన ఆహారం, ఎలుకల మలం!

హైదరాబాద్లోని రెస్టారెంట్లలో తినేవారికి అలర్ట్. నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ రెస్టారెంట్ అబ్సల్యూట్ బార్బెక్యూకు చెందిన 10 బ్రాంచుల్లో రైడ్స్ చేయగా కిచెన్ ర్యాక్స్లో ఎలుకల మలం దర్శనమిచ్చింది. మురికి పాత్రలు, అపరిశుభ్రంగా ఫ్రిడ్జ్లు, బొద్దింకలు, ఎక్స్పైరీ ఆహారం, కుల్లిపోయిన పండ్లను గుర్తించారు. నోటీసులిచ్చి చర్యలకు సిద్ధమయ్యారు.
SHARE IT
Similar News
News March 26, 2026
‘అయతుల్లా డొనాల్డ్ ట్రంప్’ అంటూ మీమ్స్.. కారణమిదే!

ఇరాన్ సుప్రీంలీడర్గా తానే ఉండాలని ఆ దేశ నేతలు అడిగారని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ పదవిని తాను కోరుకోలేదని గొప్పలు చెప్పడంపై మీమ్స్ పోటెత్తుతున్నాయి. ‘అయతుల్లా డొనాల్డ్ ట్రంప్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గడ్డంతో ఉన్న ట్రంప్ మార్ఫింగ్ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ‘అయతుల్లాగా ట్రంప్ ఛార్జ్ తీసుకున్నారు. పరిస్థితి దారుణంగా మారొచ్చు’ అని సెటైర్లు వేస్తున్నారు.
News March 26, 2026
‘చుప్పనాతి శూర్పణఖ’ అంటే ఎవరు?

మోసం, కపటం, ఓర్వలేనితనం వంటి గుణాలున్న మహిళల గురించి చెప్పే సందర్భంలో ‘చుప్పనాతి శూర్పణఖ’ జాతీయాన్ని వాడతారు. రామ రావణ యుద్ధానికి మూలకారణం శూర్పణఖ. ఆమె రావణాసురుడి చెల్లెలు. పంచవటిలో రాముడిని చూసి మోహించింది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోసేయడంతో ప్రతీకారంగా సీతపై తన అన్నకు కోరిక పుట్టేలా, రాముడిపై శత్రుత్వం పెరిగేలా చేసింది. మీ జీవితంలో చుప్పనాతి శూర్పణఖ ఎవరో కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 26, 2026
బస్సు ప్రమాదాలు ఆగేదెన్నడు: హీరో నిఖిల్

మార్కాపురం <<19478496>>బస్సు<<>> ప్రమాదంపై టాలీవుడ్ హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు తెలిసి గత 6 నెలల్లో ఇది నాలుగో బస్సు ప్రమాదం. ఈ ఘటనల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు ఆగుతాయి. అధికారులు అన్ని ట్రావెల్స్ బస్సులు & రవాణా సంస్థలను తనిఖీ చేయాలి’ అని PM మోదీ, కేంద్ర & తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులకు నిఖిల్ విజ్ఞప్తి చేశారు.


