News February 16, 2025

RR: ఉమ్మడి జిల్లాలో తగ్గిన ద్రాక్ష పంట సాగు..!

image

ఉమ్మడి RR జిల్లాలో దశాబ్దం క్రితం 10 వేలకు పైగా ఎకరాల్లో సాగైన ద్రాక్ష ప్రస్తుతం కేవలం 115 ఎకరాలకు పరిమితమైందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి మారిందని అప్పటిలా భూములు లేకపోవడంతో ద్రాక్ష సాగు తగ్గిపోతున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. కూలీల ఖర్చులు సైతం పెరుగుతున్నాయని, దిగుమతి సమయంలో ఈదురుగాలి, వడగండ్లతో నష్టపోవాల్సి వస్తుందన్నారు. మేడ్చల్, శామీర్పేట, కీసరలో అప్పట్లో సాగు చేసేవారు.

Similar News

News December 20, 2025

ASF: పంచాయతీ పోరులో సగం.. సత్తా చాటిన మహిళలు

image

ASF జిల్లాలో 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీపడ్డారు. జిల్లాలో 332 గ్రామ పంచాయతీలలో జరిగిన ఎన్నికల్లో 170 మంది మహిళ సర్పంచ్లు గెలుపొందారు. మొదటి విడతలో 60 మంది, 2వ విడతలో 54, 3వ విడతలో 56 మహిళలు ఎన్నికయ్యారు.

News December 20, 2025

కామారెడ్డి: లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలి

image

కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, బీడీ కార్మికులు, ఇతర కంపెనీల్లో పనిచేసి పదవి విరమణ పొంది పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు ఈ నెలాఖరులోగా అందజేయాలని ఉమ్మడి జిల్లా ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్లు అందజేయనివారు మీసేవా కేంద్రాల్లో అందజేయాలన్నారు.

News December 20, 2025

కొండంత లక్ష్యం.. ఎదురొడ్డుతున్న ఇంగ్లండ్

image

యాషెస్ మూడో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. కొండంత లక్ష్యంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు ఆదిలోనే ఓపెనర్ డకెట్(4) వికెట్ కోల్పోయింది. తర్వాత పోప్(17) కూడా ఔట్ అయ్యారు. దీంతో ఆ జట్టు 49 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో క్రాలే, రూట్ ఉన్నారు. ఆట ఇవాళ, రేపు మిగిలి ఉండగా ENG టార్గెట్‌ను ఛేదించడం గగనమే.