News February 16, 2025
RR: ఉమ్మడి జిల్లాలో తగ్గిన ద్రాక్ష పంట సాగు..!

ఉమ్మడి RR జిల్లాలో దశాబ్దం క్రితం 10 వేలకు పైగా ఎకరాల్లో సాగైన ద్రాక్ష ప్రస్తుతం కేవలం 115 ఎకరాలకు పరిమితమైందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి మారిందని అప్పటిలా భూములు లేకపోవడంతో ద్రాక్ష సాగు తగ్గిపోతున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. కూలీల ఖర్చులు సైతం పెరుగుతున్నాయని, దిగుమతి సమయంలో ఈదురుగాలి, వడగండ్లతో నష్టపోవాల్సి వస్తుందన్నారు. మేడ్చల్, శామీర్పేట, కీసరలో అప్పట్లో సాగు చేసేవారు.
Similar News
News March 17, 2026
MDK: 428 అంగన్వాడీలకు మహార్దశ

అంగన్వాడీలకు మహర్దశ రానుంది. అసౌకర్యాలకు నిలయంగా మారిన అంగన్వాడీలు బలోపేతం కానున్నాయి. తెలంగాణలో 5008 అంగన్వాడీలను ‘సక్షం’లో భాగంగా ఆధునికీకరించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా మెదక్లో 130, సంగారెడ్డిలో 298 అంగన్వాడీలు సక్షం సెంటర్లుగా ఎంపికయ్యాయి. ఎంపికైన కేంద్రాల్లో మెరుగైన వసతుల కల్పనతో పాటు డిజిటల్ విద్యా బోధన, LED స్క్రీన్ల ఏర్పాటు, పోషకాహారం అందనుంది.
News March 17, 2026
పెరగనున్న కార్ల ధరలు!

కార్ల కంపెనీలు మరోసారి షాక్ ఇవ్వనున్నాయి. తమ వెహికల్స్ ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. రూపాయి పతనం, రా మెటీరియల్ ఖర్చులు ఎక్కువ కావడంతో ఇప్పటికే జనవరిలో ఓసారి పెంచాయి. తాజాగా వచ్చే నెలలో మెర్సిడెస్ బెంజ్, ఆడి 2 శాతం చొప్పున, టాటా సంస్థ 1.5 శాతం పెంచనున్నాయి. హ్యుందాయ్, మారుతీ సుజుకీ సహా మిగతా ప్రధాన సంస్థలు కూడా ధరలు సవరించాలని భావిస్తున్నాయి.
News March 17, 2026
ఫోన్ పోయిందా అయితే ఇలా చేయండి: VZM ఎస్పీ

మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనం జరిగినా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి లేదా ఆన్లైన్లో CEIR పోర్టల్ ద్వారా నమోదు చేయవచ్చని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసి మొబైల్ ట్రాకింగ్ చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. ప్రజలు తమ మొబైల్ IMEI నంబర్ను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేయవద్దని సూచించారు.


