News August 28, 2024

RR జిల్లాలో లక్షకు పైగా MSME యూనిట్లు

image

లక్షకు పైగా MSMEలు ఉన్న జిల్లాల్లో రంగారెడ్డి రెండో స్థానంలో ఉంది.ఇక్కడ 1,09,164 యూనిట్లు ఉండగా.. అందులో 87,376 సేవా రంగానికి చెందినవే.మిగిలిన 21,788 ఉత్పత్తి రంగంలో పనిచేస్తు న్నాయి.సూక్ష్మ సంస్థల సంఖ్యనే 1,04,846గా ఉంది. రూ.కోటిలోపు పెట్టుబడి, రూ.5 కోట్లలోపు టర్నోవర్ కల్గిన వాటిని సూక్ష్మ సంస్థలుగా పరిగణిస్తారు.జూన్ 2024 వరకు ఉన్న వివరాల ప్రకారం చిన్న తరహా 3,866 ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News October 16, 2024

HYD: బైకులు ఎత్తుకెళ్తున్నారు.. జాగ్రత్త..!

image

ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు చెందిన వారు స్థానికులతో చేతులు కలిపి బండ్లను కొట్టేస్తున్నట్లు పోలీసులు తాజాగా తేల్చారు. HYD పాతబస్తి, శివారు ప్రాంతాల్లో దొంగతనాల కోసం మైనర్లకు కమిషన్లు ఆశ చూపిస్తున్నారు. కేవలం 10 సెకండ్లలో హ్యాండిల్ లాక్ తీసి ఎత్తుకెళ్తున్నారు. ఈ ఏడాది HYDలో 1,300 పైగా బైక్ చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఇంటి బయట బైక్‌లు పార్కింగ్ చేసేవారు జాగ్రత్త. #SHAREIT

News October 16, 2024

BREAKING: HYD: దంపతుల దారుణ హత్య

image

రంగారెడ్డి జిల్లాలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కందుకూరు PS పరిధి కొత్తగూడ ఫామ్ హౌస్‌లో దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉషయ్య(55), శాంతమ్మ(50)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 16, 2024

HYD: ‘మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేందుకే ఎస్సీ వర్గీకరణ’

image

అన్నదమ్ముళ్లలా ఐక్యంగా ఉన్న మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేందుకే ఎస్సీ వర్గీకరణ తెచ్చారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ రాజు వస్తాద్ ఆరోపించారు. లోయర్ బ్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ భవన్లో సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం మాల మాదిగలను రెండుగా విభజించారని మండిపడ్డారు.