News July 12, 2024
RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

✓10 మంది BRS ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు:MLA దానం ✓HYD:నిరుద్యోగ దీక్ష చేస్తున్న బక్క జడ్సన్ ఆసుపత్రికి తరలింపు
✓కూకట్పల్లి:రూ.36 కోట్లతో JNTUH లో ఐకానిక్ బిల్డింగ్
✓బాలానగర్:ఫతేనగర్లో ట్రాన్స్ జెండర్ దారుణ హత్య
✓అత్తాపూర్ శ్రీ చైతన్య పాఠశాలకు బాంబు బెదిరింపు
✓ఉప్పల్: భార్యను హత్య చేసి బ్యాగులో వేసిన భర్త
Similar News
News February 18, 2026
ఉప్పుగూడలో గంజాయి చాక్లెట్ల పట్టివేత!

ఉప్పుగూడలో గంజాయి చాక్లెట్లను తండైలో కలిపి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన వికాస్ శర్మ (23) ఇటీవలే ఉప్పుగూడకు మకాం మార్చాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ అధికారులు అతని ఇంటిపై దాడిచేసి తనిఖీలు నిర్వహించారు. సుమారు 9.6కిలో గ్రాముల బరువు చేసే 1,920 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు.
News February 18, 2026
రంగారెడ్డి: పోలీసుల అదుపులో 23 మంది విదేశీయులు

టోలిచౌకి పరిధిలోని పలు కాలనీల్లో డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షణలో 250 మంది పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న 23 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలతో పాటు 53 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
News February 17, 2026
HYD: జేఈఈ మెయిన్స్లో Resonance ప్రభంజనం!

JEE మెయిన్ 2026 సెషన్-1 ఫలితాల్లో హైదరాబాద్ Resonance విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. 55 మందికి పైగా విద్యార్థులు 99 పర్సెంటైల్కు మించి స్కోరు చేసి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. సమృద్ధి భట్టాచార్య 99.988, రేవంత్ వంగల 99.982, సాకేత్ రెడ్డి 99.932, ఆదిత్య రెడ్డి 99.918, అన్విత రెడ్డి 99.915 అగ్రస్థానంలో నిలిచారు. క్రమశిక్షణతో కూడిన శిక్షణే ఈ విజయానికి కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.


