News March 4, 2025
RR: ఒక్కొకరికి ఏడాదికి రూ.9.54 లక్షల సంపాదన..!

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా వార్షిక తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.9.54 లక్షలతో మొదటి స్థానంలో ఉంది. HYD రూ.4.97 లక్షలుగా ఉండగా, చివరిగా వికారాబాద్ 33వ స్థానంలో రూ.1.9 లక్షలుగా ఉంది. ఈ వివరాలను రాష్ట్ర గుణాంకాల నివేదిక- 2024లో వెల్లడించింది. తాజాగా అధికారులు రిపోర్ట్ విడుదల చేశారు.
Similar News
News November 6, 2025
జగిత్యాల: రాయికల్లో కానిస్టేబుల్పై దాడికి యత్నం

రాయికల్ మండలం కుమ్మరిపల్లికి చెందిన దొంతి సాయి(23), గంజాయి కేసులో పరారీలో ఉండగా రాయికల్ బస్టాండ్ వద్ద కానిస్టేబుల్ వెంకటేశ్ అతడిని పట్టుకున్నాడు. స్టేషన్కు తీసుకెళ్తుండగా సాయి బండిని వేగంగా నడుపుతూ కానిస్టేబుల్ను కిందపడేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. గాయాలతోనూ అతడిని తిరిగి పట్టుకున్నాడు. ఈ సమయంలో సాయి తండ్రి మురళి, అన్న నాగరాజు అడ్డుపడడంతో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
News November 6, 2025
దురుద్దేశంతోనే నాపై స్టాలిన్ ఆరోపణలు: విజయ్

కరూర్(TN) తొక్కిసలాటపై CM స్టాలిన్ అసెంబ్లీలో తనపై ద్వేషంతోనే ఆరోపణలు చేశారని TVK చీఫ్ విజయ్ విమర్శించారు. బాధితుల్ని ఆదుకున్నా రాజకీయ, ప్రభుత్వ, మీడియా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దీంతోనే నిష్పాక్షిక విచారణ జరగదని సుప్రీం గుర్తించిందని చెప్పారు. ఎన్నికల్లో DMK, TVK మధ్యే పోటీ అని స్పష్టంచేశారు. తొక్కిసలాట తర్వాత తొలిసారి భేటీ అయిన TVK కౌన్సిల్ CM అభ్యర్థిగా విజయ్ను డిక్లేర్ చేసింది.
News November 6, 2025
HYD: 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదు: సీఎం

బీఆర్ఎస్ సహకరించకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పేరుతో జూబ్లీహిల్స్లో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరితే KCRకు 24 గంటల్లో చిప్పకూడు తినిపిస్తానన్న MP కిషన్ రెడ్డి, విచారణకు ఆదేశించి 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ 30 వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.


