News February 6, 2025
RR: షాద్నగర్లో బంద్కు పిలుపు
శస్త్ర పాఠశాలలో నీరజ్ అనే విద్యార్థి స్కూల్ పై నుంచి దూకి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా నేడు షాద్నగర్ పట్టణంలోని అన్ని విద్యాసంస్థల బంద్కు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు పాఠశాలల యాజమాన్యాలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహాన్ సూచించారు.
Similar News
News February 6, 2025
HYD: KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)
GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా చేయాలా..? వద్ద..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.
News February 6, 2025
HYD: ఒకే రోజు 10 మంది మృతి!
HYDలో విషాద ఘటనలు వెలుగుచూశాయి. నిన్న ఒక్కరోజే 10 మంది చనిపోయారు. LBనగర్లో గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. గచ్చిబౌలిలో రిటోజ, SRనగర్లో అమర్జిత్, రాయదుర్గంలో ధర్మప్రధాన్, షాద్నగర్లో నీరజ్, చెరువులో దూకి పీర్జాదిగూడ వాసి బాలరాజు, మీర్పేటలో వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరు కారణాలతో ఆరుగురు సూసైడ్ చేసుకోగా.. శంకర్పల్లిలో బస్ ఢీ కొని బీటెక్ విద్యార్థి మృతి చెందడం బాధాకరం.
News February 6, 2025
HYD: షాకింగ్.. కిడ్నాప్ వెనుక ACP
హైదరాబాద్లో ఓ ACPపై సస్పెన్షన్ వేటు పడిన వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. శంకర్పల్లి మోకిల ప్రాంతంలో ఏడాది కిందట జరిగిన కిడ్నాప్ కేసులో దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటకి వచ్చాయి. నిందితులకు బాధితుడి లొకేషన్ షేర్ చేసి కిడ్నాప్కు సహకరించింది ఏసీపీ అని తేలడంతో పోలీస్ ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. ఛార్జ్ షీట్లో నిందితుల జాబితాలో సదరు ఏసీపీ పేరు చేర్చి ఆయనను సస్పెండ్ చేశారు.