News April 24, 2024
RR: నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. RR జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఆరే మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జి శ్రీరాములు యాదవ్ ప్రపోజల్ సంతకం చేసినట్లు పేర్కొన్నారు. చేవెళ్ల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
Similar News
News September 24, 2024
RR: జిల్లా కోర్టులో మెగా వైద్య శిబిరం
RR జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రక్త, కంటి, దంత, చర్మ, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి మందు అందజేశారు. జిల్లా ప్రధాన జడ్జి శ్రీధర్ రెడ్డి NGOలను అభినందించారు. DLSA కార్యదర్శి శ్రీదేవి, జడ్జిలు పట్టాభిరామారావు, ADJలు పద్మావతి, ఆంజనేయులు, BAR కౌన్సిల్ PRSDT కొండల్ రెడ్డి, గోపీశంకర్ యాదవ్ ఉన్నారు.
News September 23, 2024
గచ్చిబౌలి: సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే
గచ్చిబౌలి పరిధిలోని T-HUBలో సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే వేడుకలు నిర్వహిస్తామని కార్య నిర్వాహకులు తెలిపారు. AI, డిజిటల్ విధానం, ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.
News September 23, 2024
HYD: 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు
HYDలో 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 6,439 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 18% పెరగడం గమనార్హం. 2023లో 46,287 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది.