News July 4, 2024
RRR.. అత్యధికంగా గజ్వేల్లో 980 ఎకరాల సేకరణ

ఉమ్మడి జిల్లాలో RRR నిర్మాణానికి 80 శాతం సర్వే పూర్తి కావడంతో అధికారులు భూ సేకరణకు కసరత్తు చేస్తున్నారు. RRR ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 110KM ఉండటంతో 4,500 ఎకరాల భూమిని సేకరిస్తారు. అత్యధికంగా గజ్వేల్లో 980 ఎకరాలు, అందోల్-జోగిపేట, గజ్వేల్, తూప్రాన్, సంగారెడ్డి పరిధిలో మొత్తంగా 54 గ్రామాల్లో భూమి తీసుకుంటారు. అటు ప్రభుత్వ నిర్ణయంపైనే మా భవిష్యత్ ఆధారపడి ఉంటుందని భూ నిర్వాసితులు అంటున్నారు.
Similar News
News December 18, 2025
మెదక్ జిల్లాలో మొత్తం పోలింగ్ 89.30 %

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.30 % పోలింగ్ నమోదైంది. 21 మండలాలు, 492 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 4,98,152 మంది ఓటర్లకు 4,44,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,39,339లో 2,15,602 మంది, మహిళలు 2,58,806లో 2,29,235 మంది, ఇతరులు ఏడుగురిలో 5 మంది ఓటు వేశారు.
News December 18, 2025
చేగుంట: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేగుంట మండలం కరీంనగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అక్బర్ గత నెల 29న ఈ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గురువారం మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News December 18, 2025
‘టెన్త్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించాలి’

STUTS మెదక్ జిల్లా 2026 నూతన సంవత్సర క్యాలండర్ను అదనపు కలెక్టర్ నగేష్ ఆవిష్కరించారు. జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్మా ట్లాడుతూ.. STUTS సంఘ బాధ్యులు పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సహకరించడం అభినందనీయమన్నారు. టెన్త్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి విజయ అన్నారు.


