News October 3, 2024
PM- RKVY స్కీమ్కు రూ.లక్ష కోట్ల మంజూరు

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకి రూ.లక్ష కోట్లను మంజూరు చేసింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్కు ఆమోదం తెలిపింది. రూ.10,103 కోట్లతో నూనెగింజల ఉత్పత్తికి నిర్ణయించింది. మరాఠీ, పాళీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కల్పించింది. చెన్నై మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలిపింది.
Similar News
News October 11, 2025
ఛార్మీతో రిలేషన్పై స్పందించిన పూరీ

ఛార్మీతో తనకు ఉన్న అనుబంధంపై దర్శకుడు పూరీ జగన్నాథ్ క్లారిటీ ఇచ్చారు. తనకు 13 ఏళ్ల వయసు నుంచే ఛార్మీ తెలుసని, 20 ఏళ్ల స్నేహంతో తాము కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. పెళ్లైన మహిళతో ఉంటే ఎవరికీ సమస్య ఉండదని, ఛార్మీకి పెళ్లి కాలేదు కాబట్టే తమ మధ్య ఏదో ఉందనుకుంటున్నారని అన్నారు. స్నేహం మాత్రమే శాశ్వతమన్నారు. పూరీ నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’ బాధ్యతలను కొంతకాలంగా ఛార్మీ చూసుకుంటున్నారు.
News October 11, 2025
AIకి అధిక విద్యుత్ ఎందుకు అవసరం?

AI, డీప్ లెర్నింగ్ మోడల్స్ చేసే కాలిక్యులేషన్స్కు GPU, TPUల వంటి హై-పవర్ హార్డ్వేర్ అవసరం అవుతుంది. ఆ హార్డ్వేర్, వాటి నుంచి వచ్చే వేడిని తగ్గించడానికి కూలింగ్ వ్యవస్థలూ <<17977805>>హైపవర్<<>>ను డిమాండ్ చేస్తాయి. పెద్ద AI మోడల్స్ శిక్షణకు వేల గంటల పాటు హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అవసరం అవుతుంది. అలాగే డేటా సెంటర్లలోని సర్వర్లు, నెట్వర్కింగ్ సామగ్రికీ.. 24/7 AI సేవలకు అధిక విద్యుత్ కావాల్సి ఉంటుంది.
News October 11, 2025
పేరులో చిన్న మార్పు… కుప్పకూలిన కంపెనీ

పేరులో చిన్న మార్పు ఓ కంపెనీ పతనానికి దారితీసింది. ఢిల్లీకి చెందిన ‘B9 బెవరేజెస్ Pvt Ltd’కి చెందిన Bira91 బీర్లకు పదేళ్లుగా ఎంతో డిమాండ్ ఉండేది. 2024లో IPO కోసం Pvt అనే పదాన్నితొలగించింది. కొత్త పేరుతో వచ్చిన బీర్లు పాత కంపెనీవే అని నమ్మక రాష్ట్రాల్లో నిషేధించారు. ఉత్పత్తీ నిలిచిపోయింది. ₹748 కోట్ల నష్టంతో సిబ్బందికి జీతాలూ చెల్లించలేకపోయింది. కంపెనీ CEO జైన్ను తొలగించాలని వారు పిటిషన్ వేశారు.