News October 3, 2024
PM- RKVY స్కీమ్కు రూ.లక్ష కోట్ల మంజూరు

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకి రూ.లక్ష కోట్లను మంజూరు చేసింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్కు ఆమోదం తెలిపింది. రూ.10,103 కోట్లతో నూనెగింజల ఉత్పత్తికి నిర్ణయించింది. మరాఠీ, పాళీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కల్పించింది. చెన్నై మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలిపింది.
Similar News
News October 8, 2025
నవోదయ ప్రవేశాల గడువు మళ్లీ పెంపు

నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో సీట్ల భర్తీకి అప్లికేషన్ గడువును మరోసారి పొడిగించారు. మొదట సెప్టెంబర్ 23తో దరఖాస్తు గడువు ముగియగా దానిని అక్టోబర్ 7 వరకు పెంచారు. ఆ గడువు కూడా నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని JNV అధికారులు తెలిపారు. లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 7న నిర్వహించనున్నారు.
News October 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 29 సమాధానాలు

1. వశిష్ట మహాముని భార్య ‘అరుంధతి’.
2. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది.
3. తిరుమలలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
4. శివుడు వాయు లింగంగా కొలువైన ఆలయం ‘శ్రీకాళహస్తి’.
5. జీవితంలోని పురుషార్థాలు 4. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షములు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 8, 2025
చికిత్స తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ తిరిగి వస్తుందా?

మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదకర క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అయితే చికిత్స తర్వాత క్యాన్సర్ తగ్గిపోయినట్టు కనిపించినా కొన్నిసార్లు తిరిగిరావొచ్చంటున్నారు నిపుణులు. కొన్ని క్యాన్సర్ కణాలు నిద్రాణ స్థితిలో ఉండి గుర్తించలేనివిగా ఉంటాయి. కాబట్టి చికిత్స తర్వాత కూడా చెకప్లు చేయించుకోవాలి. అలాగే శరీరంలో ఏవైనా అసాధారణమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. <<-se>>#WomenHealth<<>>