News October 3, 2024
PM- RKVY స్కీమ్కు రూ.లక్ష కోట్ల మంజూరు

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకి రూ.లక్ష కోట్లను మంజూరు చేసింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్కు ఆమోదం తెలిపింది. రూ.10,103 కోట్లతో నూనెగింజల ఉత్పత్తికి నిర్ణయించింది. మరాఠీ, పాళీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కల్పించింది. చెన్నై మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలిపింది.
Similar News
News October 10, 2025
రూ.1.20 లక్షల జీతం.. 13న ఇంటర్వ్యూలు

AP: మైనారిటీ యువతకు ఖతర్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. దోహాలో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాల కోసం ఈనెల 12లోగా http://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 13న విజయవాడలో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. 21-40 ఏళ్ల వయసుండి B.Sc/GNM నర్సింగ్ విద్యార్హత, అనుభవం ఉండాలన్నారు. ఎంపికైన వారు IT కటింగ్స్ లేకుండా నెలకు రూ.1.20 లక్షలు పొందవచ్చని తెలిపారు.
News October 10, 2025
రేపు ధనధాన్య కృషి యోజన ప్రారంభం

దేశంలో వ్యవసాయ రంగ ఉత్పాదకతను మరింత పెంచేందుకు కేంద్రం ప్రకటించిన ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. జాతీయ సగటుకంటే తక్కువగా పంట ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపికచేశారు. ఈ జిల్లాల్లో సాగునీటి వ్యవస్థ, పంట నిల్వ సామర్థ్యం, రుణసదుపాయం, పంటసాగులో వైవిధ్యం పెంచడానికి కేంద్రం చేయూతనందిస్తుంది. ఏటా రూ.24 వేల కోట్ల వ్యయంతో ఆరేళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేస్తారు.
News October 10, 2025
పాక్కు అడ్వాన్స్డ్ మిస్సైళ్లు అమ్మడం లేదు: US

పాక్కు కొత్తగా అడ్వాన్స్డ్ మిస్సైళ్లను అమ్మనున్నట్లు వస్తున్న వార్తలను US ఖండించింది. ‘కాంట్రాక్టులో అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్స్(AMRAAMs)ను పాక్కు డెలివరీ చేస్తామన్న అంశం లేదు’ అని తెలిపింది. కానీ పాక్ సహా పలు దేశాలకు ఆయుధాల నిర్వహణకు సాయం & విడిభాగాలు సరఫరా చేస్తామని ఆ కాంట్రాక్ట్లో ఉంది. దీంతో US డబుల్ గేమ్ ఆడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.