News October 3, 2024
PM- RKVY స్కీమ్కు రూ.లక్ష కోట్ల మంజూరు

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకి రూ.లక్ష కోట్లను మంజూరు చేసింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్కు ఆమోదం తెలిపింది. రూ.10,103 కోట్లతో నూనెగింజల ఉత్పత్తికి నిర్ణయించింది. మరాఠీ, పాళీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కల్పించింది. చెన్నై మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలిపింది.
Similar News
News October 11, 2025
వరుసగా 3 రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవారం వరుసగా 3రోజులు సెలవులు రానున్నాయి. పలు సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు స్కూళ్లకు శనివారం, ఆదివారం హాలిడేస్ ఉంటాయి. వీటికి తోడు సోమవారం(OCT 20) దీపావళి కావడంతో మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. లాంగ్ వీకెండ్ రావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. దీపావళి సెలబ్రేట్ చేసేందుకు సొంతూళ్లకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకొనే పనిలో పడ్డారు.
News October 11, 2025
ఇండియన్ కోస్డ్గార్డ్లో ఉద్యోగాలు..

ఇండియన్ కోస్ట్గార్డ్ 22 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 11వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్, ఇంజిన్ డ్రైవర్, ఫైర్మెన్, ఎంటీఎస్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News October 11, 2025
తాజా అప్డేట్స్

* AP: ఉప్పాడ తీరప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
* నకిలీ మద్యం కేసులో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. ఇంకా అరెస్టులు ఉంటాయి: మంత్రి డీబీవీ స్వామి
* TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసే BJP అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర చీఫ్ రాంచందర్రావు
* ఆయుర్వేద ఇనిస్టిట్యూట్ మంజూరు చేయాలని కేంద్రానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లేఖ