News October 3, 2024

PM- RKVY స్కీమ్‌కు రూ.లక్ష కోట్ల మంజూరు

image

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకి రూ.లక్ష కోట్లను మంజూరు చేసింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్‌కు ఆమోదం తెలిపింది. రూ.10,103 కోట్లతో నూనెగింజల ఉత్పత్తికి నిర్ణయించింది. మరాఠీ, పాళీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కల్పించింది. చెన్నై మెట్రో ఫేజ్-2‌కు ఆమోదం తెలిపింది.

Similar News

News October 12, 2025

అర్ధరాత్రి అమ్మాయి ఎలా బయటికి వచ్చింది: మమత

image

MBBS స్టూడెంట్ గ్యాంగ్‌రేప్ ఘటనపై బెంగాల్ CM మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాలేజీ నుంచి అర్ధరాత్రి 12.30గం.కు అమ్మాయి ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు. రాత్రిపూట బయటకు రానివ్వకూడదని అన్నారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకోవాలని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘మణిపుర్, బిహార్, UP, ఒడిశాలో ఇలాంటివి జరిగాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.

News October 12, 2025

ఉచితాలు కాదు.. భవిష్యత్ కావాలన్నారు: పవన్

image

AP: తిత్లీ తుఫాను సమయంలో శ్రీకాకుళం యువతను పరామర్శించానని, వాళ్లతో జరిగిన సంభాషణ గుర్తుందని Dy.CM పవన్ పేర్కొన్నారు. ‘వారు ఉచితాలు, సంక్షేమ పథకాలు అడగలేదు. 25 ఏళ్ల మంచి భవిష్యత్ కావాలన్నారు. నిత్యం యువతతో మాట్లాడుతూ ఉంటా. వారి కలలు నిజం చేసేందుకు కృషి చేస్తా’ అని పేర్కొన్నారు. 2018లో పవన్‌తో తన జర్నీ మొదలైందని మంత్రి మనోహర్ ఓ ఫోటోను ట్వీట్ చేయగా దానికి పవన్ పైవిధంగా స్పందించారు.

News October 12, 2025

చిదంబరం మాటలు.. కాంగ్రెస్‌లో మంటలు!

image

కాంగ్రెస్ నేత చిదంబరం చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. 26/11 ముంబై దాడులకు ప్రతీకారంగా పాక్‌పై అటాక్ చేయకుండా అమెరికా ఒత్తిడి చేయడంతో వెనక్కి తగ్గినట్లు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సైనిక చర్య తప్పుడు మార్గమని తాజాగా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ, మోదీ లైన్‌లో చిదంబరం మాట్లాడుతున్నారని మండిపడింది.