News February 17, 2025
గద్దర్ అవార్డుల కోసం రూ.10 కోట్లు?

TG: గద్దర్ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.10 కోట్లు ప్రతిపాదించినట్లు సమాచారం. బడ్జెట్ తయారుచేసేందుకు గాను అన్ని శాఖలతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సమాచార శాఖ, సినీ అభివృద్ధి సంస్థలతో బడ్జెట్ కేటాయింపులపై ఆయన సమీక్షించినట్లు తెలుస్తోంది. నంది అవార్డులను ఇకపై గద్దర్ పేరిట ఇస్తామని సీఎం రేవంత్ గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 16, 2025
వారణాసి: ఒకేసారి ఇన్ని సర్ప్రైజులా?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘<<18299698>>వారణాసి<<>>’ నుంచి వరుస అప్డేట్స్ వచ్చాయి. globe trotter ఈవెంట్లో మూవీ టైటిల్, మహేశ్ ఫస్ట్ లుక్, 3.40 నిమిషాల గ్లింప్స్ రిలీజ్ చేశారు. 2027 సమ్మర్లో మూవీ విడుదల అని కీరవాణి తెలిపారు. రామాయణంలో ముఖ్యమైన <<18299599>>ఘట్టం <<>>తీస్తున్నానని, మహేశ్కు రాముడి వేషం వేశానని రాజమౌళి వెల్లడించారు. దీంతో ఒకేసారి ఇన్ని సర్ప్రైజులు ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
News November 16, 2025
జాతీయవాదం వల్లే యుద్ధాలు: మోహన్ భాగవత్

ప్రపంచ సమస్యలకు సమాధానాలు అందించే తెలివి, ఆలోచన ఇండియాకు ఉన్నాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ‘జాతీయవాదం కారణంగానే యుద్ధాలు జరుగుతాయి. అందుకే ప్రపంచ నేతలు అంతర్జాతీయవాదం గురించి మాట్లాడటం ప్రారంభించారు. కానీ తమ దేశ ప్రయోజనాలనే ప్రధానంగా చూసుకుంటారు’ అని చెప్పారు. జైపూర్లో నిర్వహించిన దీన్ దయాళ్ స్మృతి ఉపన్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
News November 16, 2025
200 కొట్టినా నాన్న సంతృప్తిచెందరు: వైభవ్

యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్తో చెలరేగుతున్న విషయం తెలిసిందే. UAEపై వీర విహారం చేసి 32 బంతుల్లోనే <<18287840>>సెంచరీ<<>> నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి గురించి వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను 200 కొట్టినా నాన్న సంతృప్తిచెందరు. ఇంకో 10 రన్స్ చేసి ఉండేవాడినని అంటారు. అమ్మ మాత్రం సెంచరీ చేసినా, డకౌట్ అయినా సంతోషంగానే ఉంటుంది. బాగా ఆడమని చెబుతుంది’ అని BCCI ఇంటర్వ్యూలో చెప్పారు.


