News April 23, 2025

ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: CM చంద్రబాబు

image

AP: పహల్‌గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహానికి CM చంద్రబాబు నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామన్నారు. చంద్రమౌళితో పాటు కావలికి చెందిన మరో వ్యక్తి మరణించగా, ఇరు కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉగ్రదాడి జరిగిందని, సరిహద్దుల్లో చొరబాటుదారులను సమర్థంగా అడ్డుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

Similar News

News April 24, 2025

నేటి నుంచి అప్పన్న నిజరూప దర్శన టికెట్లు

image

సింహాచలంలో ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు టికెట్ల(రూ.300, రూ.1,000) విక్రయాలు ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. ఆన్‌లైన్‌లో www.aptemples.ap.gov.in ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో సింహాచలం పాత పీఆర్వో ఆఫీస్, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంకులో అందుబాటులో ఉంటాయి.

News April 24, 2025

దేశీయ HPV కిట్లు త్వరలో విడుదల: జితేంద్ర

image

సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన <<15380344>>HPV<<>> కిట్లను త్వరలో విడుదల చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అందుబాటు ధరలో టీకాలు, టెస్టులు, ట్రీట్‌మెంట్ చేయడమనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘సర్వైకల్’ మృతుల్లో 25% INDలోనే నమోదవుతున్నాయని చెప్పారు. చికిత్స ఆలస్యమవడం వల్లే ఇలా జరుగుతోందని, వైద్య సేవల అందించడానికి ప్రైవేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు.

News April 24, 2025

వెంకటేశ్‌తో కలిసి సినిమా.. నాని ఏమన్నారంటే?

image

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ప్యారడైజ్’ మూవీ షూటింగ్ మే 2న ప్రారంభమవుతుందని హీరో నాని తెలిపారు. ఆ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదలవుతుందని చెప్పారు. ఆ తర్వాత సుజీత్‌తో చిత్రం ఉంటుందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘వెంకటేశ్, నేను హీరోలుగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలనుకున్నారు. అలాగే శేఖర్ కమ్ములతోనూ చర్చలు జరిగాయి. అయితే ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!