News September 24, 2025

రూ.100 లంచం ఆరోపణ.. 39 ఏళ్ల న్యాయ పోరాటం

image

ఓ తప్పుడు ఆరోపణ రాయ్‌పుర్‌కు చెందిన జగేశ్వర్ ప్రసాద్(83) జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేసింది. MPSRTCలో బిల్లింగ్ అసిస్టెంట్‌ జగేశ్వర్‌ను సహోద్యోగి 1986లో లంచం కేసులో ఇరికించాడు. 1988-1994 వరకు సస్పెన్షన్, తర్వాత సగం జీతంతో బదిలీ చేశారు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఆ ఒత్తిడితో భార్య చనిపోయింది. ఆఖరికి 39 ఏళ్ల తర్వాత హైకోర్టు ఆయన్ను నిర్దోషిగా తేల్చింది.

Similar News

News September 24, 2025

రేపు పలు జిల్లాలకు భారీ వర్షసూచన

image

AP: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. SKL, VZM, మన్యం, అల్లూరి తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.

News September 24, 2025

మైనింగ్ సెక్టార్‌లో సంస్కరణలు: కిషన్ రెడ్డి

image

TG: మైనింగ్ సెక్టార్‌లో సంస్కరణలను తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘ప్రపంచ దేశాలన్నీ క్రిటికల్ మినరల్స్ కోసం పోటీ పడుతున్నాయి. సెల్ ఫోన్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు , అగ్రికల్చర్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు వీటికి డిమాండ్ ఉంది. ₹32,000Crతో నేషనల్ మినరల్ క్రిటికల్ మిషన్‌ను ప్రారంభించాం. స్క్రాప్ నుంచి మినరల్స్‌ను తీసే ప్రయత్నం జరుగుతోంది’ అని పేర్కొన్నారు.

News September 24, 2025

పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

AP: వివిధ శాఖల్లోని 47 పోస్టుల భర్తీకి APPSC <>నోటిఫికేషన్<<>> జారీ చేసింది. ఇందులో Asst ఇంజినీర్, రవాణా, జైళ్లు, ఫిషరీస్, దివ్యాంగ, మైన్స్, మున్సిపల్, సైనిక్ వెల్ఫేర్ శాఖల్లోని పోస్టులున్నాయి. వీటికి దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించారు. కాగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో అసిస్టెంటు డైరెక్టర్, వైద్యశాఖలో లైబ్రేరియన్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన వచ్చేనెల 7న ఉంటుందని కమిషన్ పేర్కొంది.