News May 18, 2024

ప్రధానిని అవమానించమని రూ.100కోట్లు ఆఫర్: BJP నేత

image

ప్రధాని మోదీని అవమానించేలా మాట్లాడితే రూ.100కోట్లు ఇస్తామని కర్ణాటక డిప్యూటీ CM శివకుమార్ ఆఫర్ చేశారని BJP నేత జి.దేవరాజే గౌడ ఆరోపించారు. ఆ డీల్‌కు ఒప్పుకోనందుకే తనపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారన్నారు. మోదీతో పాటు కర్ణాటక మాజీ CM కుమారస్వామిని కూడా కించపరిచేలా మాట్లాడాలని తనపై ఒత్తిడి చేసి, రూ.5కోట్లు అడ్వాన్స్ పంపించారని గౌడ తెలిపారు. కాగా ఆయన ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Similar News

News November 16, 2025

ఇండియా-A ఘన విజయం

image

రాజ్‌కోట్ వేదికగా సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికార వన్డేలో ఇండియా-A 9 వికెట్ల తేడాతో గెలిచింది. 133 పరుగుల లక్ష్యాన్ని 28 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో రుతురాజ్ (68*) హాఫ్ సెంచరీతో రాణించగా అభిషేక్ 32, తిలక్ 29* రన్స్ చేశారు. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్‌ను ఇండియా-A 2-0తో సొంతం చేసుకుంది. మూడో అనధికార వన్డే ఈ నెల 19న రాజ్‌కోట్‌లో జరగనుంది.

News November 16, 2025

TG న్యూస్ రౌండప్

image

* ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ HYDలో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ ఏర్పాటుచేసిన తేనీటి విందుకు CM రేవంత్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ హాజరయ్యారు.
* రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21న HYDలో భారతీయ కళా మహోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్లి సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.
* రైతులకు యాసంగి బోనస్ రూ.200 కోట్లను వెంటనే విడుదల చేయాలి: హరీశ్ రావు

News November 16, 2025

RRB PO అడ్మిట్ కార్డులు విడుదల

image

IBPS RRB PO(Officer Scale-I) ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.ibps.in/లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, పాస్‌వర్డ్‌తో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ నవంబర్ 22, 23 తేదీల్లో జరగనుంది. మెయిన్స్ అడ్మిట్ కార్డులు డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య అందుబాటులోకి వస్తాయి. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా 3,928 పోస్టులను భర్తీ చేయనున్నారు.