News May 21, 2024
చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు..!

UPలోని ఓ చెప్పుల వ్యాపారి ఇంట్లో IT అధికారులు రూ.100 కోట్లు గుర్తించారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు చేసింది. మొత్తం 14 ప్రాంతాల్లో రెండు రోజులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మంచాలు, అల్మారాలు, బ్యాగుల్లో నోట్ల కట్టలు కుక్కారు. వాటిని లెక్కించేందుకు క్యాష్ మెషిన్లు కూడా మొరాయించాయి.
Similar News
News February 12, 2026
‘ఖేలో ఇండియా’ నుంచి 1,342 మంది అథ్లెట్ల తొలగింపు

ఖేలో ఇండియా ప్రోగ్రామ్ నుంచి గత 3ఏళ్లలో 1,342 మంది అథ్లెట్లను తొలగించినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో వెల్లడించారు. లో పర్ఫార్మెన్స్, డోపింగ్ ఉల్లంఘనలే ఇందుకు కారణమని చెప్పారు. 3ఏళ్లలో 2,905 మంది కొత్తగా చేరారని తెలిపారు. స్పోర్టింగ్ టాలెంట్ను గుర్తించి ట్రైనింగ్ ఇచ్చేందుకు కేంద్రం 2017లో ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేసింది. దీని కింద ప్రస్తుతం 23K+ మంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు.
News February 12, 2026
ఇంటర్ సెకండియర్లో NCERT ఆధారిత సిలబస్

AP: ఇంటర్ సెకండియర్లో 2026-27 నుంచి NCERT ఆధారిత సిలబస్ను అమలు చేస్తామని బోర్డు ప్రకటించింది. ‘సైన్సులో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ (బోటనీ, జువాలజీ కలిపి) ఉంటాయి. ఆర్ట్స్లో సివిక్స్, ఎకనమిక్స్, కామర్స్, హిస్టరీలుంటాయి. భాషల్లో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ ఉంటాయి’ అని బోర్డు తెలిపింది. ఫస్టియర్లోని సవరించని 5 సబ్జెక్టులను 2026-27 నుంచి సవరించి అమలు చేస్తామని పేర్కొంది.
News February 12, 2026
టాస్ గెలిచిన నమీబియా.. భారత్ బ్యాటింగ్

టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్తో మ్యాచులో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియా బ్యాటింగ్ చేయనుంది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ దూరమయ్యారు. అతడి ప్లేస్లో సంజూ శాంసన్ వచ్చారు. సిరాజ్ స్థానంలో బుమ్రా ఆడనున్నారు.
IND: శాంసన్, కిషన్, తిలక్, సూర్య, దూబే, రింకూ, హార్దిక్, అక్షర్, అర్ష్దీప్, చక్రవర్తి, బుమ్రా


