News September 18, 2024

అమరావతి రైల్వే లైన్ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు?

image

AP: అమరావతి కొత్త రైల్వే లైన్ కోసం 510 ఎకరాల భూమి అవసరమని రైల్వే శాఖ గుర్తించింది. NTR జిల్లాలో 296, గుంటూరులో 155, ఖమ్మంలో 60 ఎకరాల చొప్పున కావాలని ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపింది. ఈ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వ్యయాన్ని భరించేందుకు రైల్వే శాఖ అంగీకరించినట్లు, పాత అలైన్‌మెంట్ ప్రకారం ఎర్రుపాలెం నుంచి రైల్వే లైన్‌ను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

Similar News

News January 30, 2026

అయ్యప్ప గోల్డ్ చోరీ: నటుడిని విచారించిన SIT

image

శబరిమల బంగారం చోరీ కేసులో నటుడు జయరామ్‌ను SIT సాక్షిగా విచారించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో రిలేషన్, తన ఇంట్లో పూజలపై ప్రధానంగా ప్రశ్నించారు. తరచూ శబరికి వెళ్లే తనకు అక్కడి ఉద్యోగి పొట్టి పరిచయం ఉందని జయరామ్‌ గతంలో తెలిపారు. దేవాలయం మూసి ఉండే రోజుల్లో ఆభరణాలు ఇంట్లో ఉంచి పూజిస్తే మంచిదని తనతో చెప్పాడన్నారు. గతంలో జయరామ్ ఇంట్లో ఆభరణాలతో పూజలు చేసిన ఫొటోలు కలకలం సృష్టించాయి.

News January 30, 2026

జగన్‌ను కలిసిన చెవిరెడ్డి

image

AP: అక్రమ మద్యం కేసులో అరెస్టై నిన్న బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి YCP అధినేత జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలతో కలిసి వెళ్లి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తనతో పాటు కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని వివరించినట్లు YCP ట్వీట్ చేసింది. కాగా ఆందోళన చెందొద్దని, చట్టపరంగా ఎదుర్కొందామని జగన్ భరోసా ఇచ్చినట్లు పేర్కొంది.

News January 30, 2026

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ‘rebels’ బెడద

image

TG: మున్పి‘పోల్స్’లో పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా లేదు. PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRలకు వీటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే మహబూబ్‌నగర్, జగిత్యాల, గద్వాల్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, కొత్తగూడెంలలోని రెబల్స్‌పై పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో వారు మాట్లాడినట్లు సమాచారం. నామినేషన్లు ముగిశాక వారిని ఉపసంహరింప చేసేలా చర్యలు చేపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు FEB3.