News September 18, 2024

అమరావతి రైల్వే లైన్ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు?

image

AP: అమరావతి కొత్త రైల్వే లైన్ కోసం 510 ఎకరాల భూమి అవసరమని రైల్వే శాఖ గుర్తించింది. NTR జిల్లాలో 296, గుంటూరులో 155, ఖమ్మంలో 60 ఎకరాల చొప్పున కావాలని ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపింది. ఈ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వ్యయాన్ని భరించేందుకు రైల్వే శాఖ అంగీకరించినట్లు, పాత అలైన్‌మెంట్ ప్రకారం ఎర్రుపాలెం నుంచి రైల్వే లైన్‌ను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

Similar News

News November 15, 2025

అల్పపీడనం.. ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు

image

ఈ నెల 19 నాటికి అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 24-27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News November 15, 2025

శ్రీవారి గర్భగుడిలో ఏయే విగ్రహాలుంటాయంటే..?

image

తిరుమల ఆనంద నిలయంలో మూలవిరాట్‌ ప్రధానం కాగా అందుకు ప్రతిరూపమైన భోగ శ్రీనివాసమూర్తికి నిత్యాభిషేకాలు, రోజువారీ సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులలో పాల్గొనే శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఇతర సమయాల్లో గర్భాలయంలో కొలువై ఉంటారు. అలాగే కొలువు, ఉగ్ర శ్రీనివాసమూర్తులను కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ 5 విగ్రహాలను కలిపి ‘పంచబేరాలు’ అంటారు.
☞ మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 15, 2025

నేడు ఎంత పవిత్ర దినమో తెలుసా?

image

కార్తీకం అంటేనే పరమ పవిత్రం. ఈ మాసంలో వచ్చే ఏకాదశి అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందులోనూ ఈ ఏకాదశి శనివారం రోజున రావడం మహా యోగమని పండితులు చెబుతున్నారు. ఇన్ని శుభాలు ఒకే రోజు రావడం శ్రీహరిని కొలిచే భక్తులకు అపారమైన అనుగ్రహాన్నిస్తుంది. నేడు నారాయణుడిని పూజించి ‘దామోదర ఆవాహయామి’ అంటూ దీపాలు వెలిగిస్తే.. శని ప్రభావం తగ్గి, హరి అనుగ్రహంతో సుఖశాంతులు, సర్వశుభాలు కలుగుతాయని నమ్మకం.