News August 8, 2024

రూ.1,00,000 సాయం.. దరఖాస్తుకు మరో ఛాన్స్

image

TG: రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం <>దరఖాస్తు<<>> గడువును ఆగస్టు 12వ తేదీ వరకు పొడిగించారు. రాష్ట్రానికి చెందిన యువత సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే ఈ స్కీం కింద రూ.లక్ష సాయాన్ని సింగరేణి తరఫున ప్రభుత్వం అందిస్తుంది. గత నెల 20వ తేదీన CM రేవంత్, డిప్యూటీ CM భట్టి విక్రమార్క ప్రారంభించారు. గతంలో విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 6తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తితో తాజాగా మళ్లీ పొడిగించారు.

Similar News

News November 21, 2025

750 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. TGలో 88, APలో 5 పోస్టులు ఉన్నాయి. వయసు 20 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 21, 2025

ప్రసార్‌భారతిలో 29 పోస్టులకు నోటిఫికేషన్

image

న్యూఢిల్లీలోని <>ప్రసార్‌భారతి<<>> 29 కాపీ ఎడిటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ డిప్లొమా( జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: prasarbharati.gov.in/

News November 21, 2025

షాకింగ్ రిపోర్ట్.. భారత్‌పై పాక్ గెలిచిందన్న US!

image

అమెరికా మరోసారి భారత్‌పై అసత్య ప్రచారాలకు పూనుకుంది. పహల్గామ్ అటాక్ తర్వాత IND చేసిన ‘ఆపరేషన్ సిందూర్’కు పాకిస్థాన్ దీటుగా బదులిచ్చిందంటూ US సెనేట్‌లో ఓ నివేదికను సమర్పించింది. 4 రోజుల పోరులో పాక్ మిలిటరీ సక్సెస్ అయ్యిందని పేర్కొంది. ఈ సంఘర్షణను <<18335987>>చైనా<<>> తనకు అనుకూలంగా మార్చుకుందని తెలిపింది. ఈ రిపోర్టుపై INC నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు.