News August 16, 2025
ఒక్క లైవ్ స్ట్రీమింగ్తో రూ.105 కోట్ల విరాళాలు

అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ వేలాది మందికి ఏదో విధంగా సాయం చేస్తుంటారు. తాజాగా ఛారిటీ కోసం ఆయన లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసి తన ఫాలోవర్లు సైతం ఎంతో కొంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి రికార్డు స్థాయిలో ఏకంగా $12,000,000 (రూ.105కోట్లు)కు పైగా విరాళాలు వచ్చినట్లు బీస్ట్ Xలో ప్రకటించారు. పేదలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు.
Similar News
News August 16, 2025
రేపు ఈసీ ప్రెస్ మీట్.. రీజన్ అదేనా?

భారత ఎన్నికల సంఘం రేపు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ‘ఓట్ చోరీ’ అంటూ పలుమార్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, ఈ కారణంగానే పలు చోట్ల కాంగ్రెస్ నేతలు ఓడారని ఆయన ఆరోపించారు.
News August 16, 2025
‘OG’లో కన్మని ఎవరంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమాలో నటిస్తోన్న ప్రియాంకా మోహన్ లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. ఆమె కన్మని పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే.
News August 16, 2025
మరో సరోగసీ దందా.. గిరిజన మహిళలే టార్గెట్!

TG: మేడ్చల్లో మరో సరోగసీ దందా వెలుగులోకి రాగా నిందితులైన తల్లీకొడుకులు లక్ష్మి, నరేందర్ <<17420803>>అరెస్ట్<<>> అయిన విషయం తెలిసిందే. దర్యాప్తులో ‘6 ఫెర్టిలిటీ కేంద్రాలతో లక్ష్మికి 20 ఏళ్లుగా సంబంధాలున్నాయి. పదిసార్లకు పైగా ఎగ్ డొనేట్ చేశారు. 2సార్లు సరోగెంట్గా ఉంది. రాజమండ్రి, రంపచోడవరం గిరిజన మహిళలను టార్గెట్ చేసి వారితో ఎగ్ డొనేట్ చేయించి రూ.30వేలు ఇచ్చారు’ అని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.