News March 16, 2025

అమరావతి కోసం రూ.11వేల కోట్లు.. నేడు ఒప్పందం

image

AP: నేడు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో), సీఆర్డీఏ మధ్య ఒప్పందం కుదరనుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 22న హడ్కో రూ.11వేల కోట్ల రుణం మంజూరు చేసింది. నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదరనుంది. అగ్రిమెంట్ అయ్యాక హడ్కో నిధులను విడుదల చేయనుంది.

Similar News

News October 17, 2025

తిరుమల శ్రీవారి జనవరి కోటా విడుదల తేదీలివే

image

2026 జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ, సుప్రభాతం, అర్చన టోకెన్ల కోసం ఈ నెల 19న 10am నుంచి 21న 10am వరకు <>రిజిస్ట్రేషన్<<>> చేసుకోవచ్చని TTD ప్రకటించింది. 23న 10amకి ఆర్జిత సేవా టికెట్లు, అదే రోజున 3pmకి వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లు, 24న 11amకి శ్రీవాణి ట్రస్ట్ దాతల ఆన్‌లైన్ కోటా, 3pmకి వృద్ధులు, దివ్యాంగుల కోటా, 25న 10amకి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు (₹300), 3pmకి గదుల కోటాను విడుదల చేయనుంది.

News October 17, 2025

లడ్డూ ప్రసాదాలపై ఆ ప్రచారం అవాస్తవం: TTD

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ధరలు పెంచే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 17, 2025

విభాగాల పనితీరుపై నివేదికలివ్వండి: మంత్రి సత్యకుమార్

image

AP: వైద్యారోగ్య శాఖలోని 10 విభాగాల పనితీరు మదింపునకు మంత్రి సత్యకుమార్ యాదవ్ నూతన పంథా అనుసరిస్తున్నారు. ఈ ఏడాది APR-SEP వరకు సాధించిన ఫలితాలు, సమస్యలు, పరిష్కారం, ప్రగతి.. ఇలా 20 అంశాల ప్రాతిపదికన సమీక్షించి పనితీరు సంతృప్తిగా ఉందా లేదా నివేదించాలని అధికారులకు సూచించారు. 14వేల డిస్పెన్సరీలు, ఆసుపత్రుల ద్వారా అందే వైద్యసేవలు, పథకాల అమలు, నాణ్యత తదితరాలపై నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది.