News July 22, 2024

ఊళ్లలో రోడ్ల రిపేర్లకు రూ.1121 కోట్లు అవసరం: అధికారులు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఊళ్లలో రోడ్లను మరమ్మతులు చేసేందుకు రూ.1121.85 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. వీటిలో పెండింగ్ బిల్లుల చెల్లింపులకు రూ.258.85 కోట్లు ఇవ్వాల్సి ఉండగా పనుల్ని పూర్తి చేసేందుకు రూ.863 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. వర్షాకాలంలో అనేక చోట్ల రోడ్లు అధ్వానంగా తయారుకావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News October 28, 2025

2 రాష్ట్రాల్లో ఓట్లు… పీకేకు EC నోటీసులు

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్‌కు EC నోటీసులు జారీ చేసింది. ఆయనకు 2 రాష్ట్రాల్లో ఓటు ఉండడమే దీనికి కారణం. పీకే WBలో ఓటరుగా ఉన్నారు. తర్వాత కర్గహార్ (బిహార్) నియోజకవర్గ ఓటరుగా నమోదు అయ్యారు. రెండు చోట్ల ఓట్లుండటాన్ని గుర్తించిన EC వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చింది. అయితే బిహార్‌లో ఓటరుగా నమోదయ్యాక WB ఓటును తొలగించాలని PK అప్లై చేశారని ఆయన టీమ్ సభ్యులు తెలిపారు.

News October 28, 2025

తుఫాను ప్రభావం.. భీకర గాలులు

image

AP: మొంథా తుఫాను దృష్ట్యా పలు జిల్లాల్లో భీకర గాలులు వీస్తున్నాయి. కోనసీమ, విశాఖ, కాకినాడ జిల్లాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తీరం దాటే సమయంలో గంటకు 90-110 KM వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం *మచిలీపట్నం- 93 km/h *కాకినాడ- 82 km/h *విశాఖ- 68 km/h *రాజమండ్రి ఎయిర్‌పోర్ట్- 65 km/h *గంగవరం పోర్ట్- 58 km/h *చింతపల్లి- 55 km/h *బద్వేల్ (కడప)- 52 km/h వేగంతో గాలులు వీస్తున్నాయి.

News October 28, 2025

పూజ గదిలో ఈ విగ్రహాలు ఉండకూడదు: పండితులు

image

పూజ గదిలో శనిదేవుడు, రాహువు, కేతువుల ఫొటోలు/విగ్రహాలు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. వీటిని ఉంచడం వల్ల ఇంట్లో అశాంతి, ప్రతికూల శక్తి పెరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు. ‘ఉగ్ర రూపాలైన కాలభైరవ, మహంకాళి ఫొటోలను కూడా ఇంట్లో పెట్టడం శుభకరం కాదు. పూజ గదిలో తినకపోవడం, నిద్రించకపోవడం ఉత్తమం. తడి జుట్టుతో ఆ గదిలోకి వెళ్లడం మంచిది కాదు’ అంటున్నారు. ✍️ మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ.