News March 16, 2024
లక్షద్వీప్లో పెట్రోల్, డీజిల్పై రూ.15.33 తగ్గింపు

లక్షద్వీప్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి వీలుగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కవరట్టి, మినికాయ్ ద్వీపంలో డీజిల్పై ₹5.20, పెట్రోల్పై ₹5.19, అండ్రోట్ అండ్ కల్పేనీలో డీజిల్పై ₹15.33, పెట్రోల్పై ₹15.38 తగ్గించినట్లు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా ఇటీవల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు ₹2 చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే.
Similar News
News February 26, 2026
ఎంత అధికారివైతే మాత్రం.. ఇన్ని గొంతెమ్మ కోర్కెలా?

BSNL డైరెక్టర్ వివేక్ బంజల్ 4 పేజీల గొంతెమ్మ కోర్కెల చిట్టాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాగ్రాజ్ వ్యక్తిగత పర్యటన కోసం అండర్వేర్, కొత్త చెప్పులు, దువ్వెన, ఆయిల్, డ్రైఫ్రూట్స్, టవల్స్ సిద్ధం చేయాలని, 50 మంది అధికారులు తన కోసం ఉండాలని ఆదేశించారు. ఈ చిట్టా వైరలవడంతో కేంద్రం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎంత ఉన్నతాధికారైతే మాత్రం ఇంత అధికార దర్పం అవసరమా అని నెటిజన్లు ఫైరవుతున్నారు.
News February 26, 2026
BREAKING: స్వల్పంగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.210 తగ్గి రూ.1,61,680కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పతనమై రూ.1,48,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 26, 2026
7న ఆర్సెలార్ స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన?

APలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. MAR 7న అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి PM మోదీ, CM CBN, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ₹1.35L Crతో 2 దశల్లో స్టీల్ప్లాంట్ను నిర్మించేందుకు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.


