News December 28, 2024

ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం: బొత్స

image

AP: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ.15,000 కోట్ల భారం మోపుతోందని YCP నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని సర్కార్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ ప్రభుత్వం 7 నెలల్లోనే రూ.74 వేల కోట్ల అప్పు చేసింది. వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లతో కలిపి రూ.లక్ష కోట్ల అప్పు చేసింది. ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’ అని ఆయన నిలదీశారు.

Similar News

News November 25, 2025

ఏనుగుల సంచార ప్రాంతం ‘వలియాన వట్టం’

image

శబరిమల యాత్రలో కరిమల కొండను దిగిన తర్వాత భక్తులు చేరే ప్రాంతమే వలియాన వట్టం. ఇది చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం. ఈ ప్రాంతం ఏనుగుల సంచారానికి ప్రసిద్ధి చెందింది. ఇతర వన్యమృగాలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి. భద్రత దృష్ట్యా, చీకటి పడే సమయానికి స్వాములు ఈ ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతారు. ఈ దారి రాత్రిపూట ప్రయాణానికి సురక్షితం కాదు. <<-se>>#AyyappaMala<<>>

News November 25, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 12

image

68. ఎక్కువమంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? (జ.సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (జ.అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం? (జ.ప్రాణులు రోజూ మరణిస్తుండటం చూసి కూడా మనుషులు ఈ భూమ్మీద ఉండిపోతాను అనుకోవడం.)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (జ.ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ వీటన్నింటినీ సమంగా చూసేవాడు) <<-se>>#YakshaPrashnalu<<>>

News November 25, 2025

బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్‌లో ఉద్యోగాలు

image

బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్(<>BRIC<<>>)12 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 21వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో 6 పోస్టులను రెగ్యులర్‌గా, 6 పోస్టులను డిప్యుటేషన్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://dbtindia.gov.in