News December 28, 2024

ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం: బొత్స

image

AP: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ.15,000 కోట్ల భారం మోపుతోందని YCP నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని సర్కార్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ ప్రభుత్వం 7 నెలల్లోనే రూ.74 వేల కోట్ల అప్పు చేసింది. వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లతో కలిపి రూ.లక్ష కోట్ల అప్పు చేసింది. ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’ అని ఆయన నిలదీశారు.

Similar News

News November 25, 2025

ఓయూ: ఆదివాసి బిడ్డకు ఓయూ డాక్టరేట్

image

ఆదివాసీ విద్యార్థి, ఉద్యమ నేత సాగబోయిన పాపారావుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. సోషియాలజీ ప్రొ.పి విష్ణుదేవ్ పర్యవేక్షణలో ‘ఉప ప్రణాళిక, గిరిజన అభివృద్ధి రాష్ట్రంలోని ఐటీడీఏ భద్రాచలం సామాజిక శాస్త్ర అధ్యయనం’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను ఓయూ ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు అభినందించారు.

News November 25, 2025

ఓయూ: ఆదివాసి బిడ్డకు ఓయూ డాక్టరేట్

image

ఆదివాసీ విద్యార్థి, ఉద్యమ నేత సాగబోయిన పాపారావుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. సోషియాలజీ ప్రొ.పి విష్ణుదేవ్ పర్యవేక్షణలో ‘ఉప ప్రణాళిక, గిరిజన అభివృద్ధి రాష్ట్రంలోని ఐటీడీఏ భద్రాచలం సామాజిక శాస్త్ర అధ్యయనం’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను ఓయూ ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు అభినందించారు.

News November 25, 2025

శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

image

రష్యాతో పీస్ డీల్‌కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.