News December 27, 2024

6 నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల భారం: మేరుగు

image

AP: అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తగ్గిస్తామని చంద్రబాబు మాయమాటలు చెప్పారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఫైరయ్యారు. ఇప్పుడు ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టారని దుయ్యబట్టారు. ప్రజలపై 6 నెలల్లోనే రూ.15,485 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు. కూటమి పాలన బాదుడే బాదుడుగా ఉందని ఎద్దేవా చేశారు. కరెంట్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Similar News

News December 8, 2025

హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు!

image

వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా UIDAI కొత్త రూల్ తీసుకురానుంది. QR కోడ్ స్కానింగ్ లేదా ఆధార్ యాప్ ద్వారా వెరిఫై చేసేలా మార్పులు చేయనుంది. ఆధార్ వెరిఫికేషన్ కోరే హోటళ్ల రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది. యూజర్ల ప్రైవసీకి, డేటాకు రక్షణ కల్పించేందుకు UIDAI ఈ దిశగా అడుగులేస్తోంది. దీంతో ఓయో, ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకునే వారికి ఉపశమనం కలగనుంది.

News December 8, 2025

డెయిరీఫామ్‌తో నెలకు రూ.1.25 లక్షల ఆదాయం

image

స్త్రీలు కూడా డెయిరీఫామ్ రంగంలో రాణిస్తారని నిరూపిస్తున్నారు హిమాచల్‌ప్రదేశ్‌లోని తుంగల్ లోయకు చెందిన సకీనా ఠాకూర్. పీజీ పూర్తి చేసిన ఈ యువతి కుటుంబం వద్దన్నా ఈ రంగంలో అడుగుపెట్టారు. తన ఫామ్‌లో ఉన్న 14 హెచ్‌ఎఫ్ ఆవుల నుంచి రోజూ 112 లీటర్ల పాలను విక్రయిస్తూ.. నెలకు రూ.1.25 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. సకీనా సక్సెస్ వెనుక కారణాలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.

News December 8, 2025

DRDO CFEESలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

DRDO అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్& ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES)లో 38 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరుతేదీ. టెన్త్, ఇంటర్, ITI ఉత్తీర్ణులై, 18- 27ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ముందుగా ncvtmis.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టైపెండ్ నెలకు రూ.9600 చెల్లిస్తారు. https://www.drdo.gov.in/