News October 6, 2025
ఎకరం రూ.177 కోట్లు.. రికార్డు ధర

TG: TGIIC నిర్వహించిన భూ వేలంలో రికార్డు ధర నమోదైంది. హైదరాబాద్లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వేలం వేయగా ఎకరం ఏకంగా రూ.177 కోట్లు పలికింది. వేలంలో పాల్గొన్న ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ 7.67 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇందుకు గాను మొత్తం రూ.1,357.57 కోట్లు చెల్లించింది. గతంలో కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే.
Similar News
News October 6, 2025
కొమురం భీం వర్ధంతి.. రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

TG: గోండుల ఆరాధ్య దైవం, పోరాట యోధుడు కొమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా రేపు (మంగళవారం) ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు వర్తిస్తుందని కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సెలవు నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో NOV 8, ఆదిలాబాద్ జిల్లాలో DEC 12న (రెండో శనివారాలు) స్కూళ్లు పని చేస్తాయని పేర్కొన్నారు.
News October 6, 2025
మేమంతా క్షేమంగానే ఉన్నాం: విజయ్

కారు <<17931879>>ప్రమాదంపై<<>> సినీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అంతా క్షేమంగానే ఉన్నామని, ఎవరూ కంగారు పడొద్దని తెలిపారు. ‘కారుకు చిన్న ప్రమాదం జరిగింది. కానీ మేమంతా బాగానే ఉన్నాం. ఆ తర్వాత స్ట్రెంత్ వర్కౌట్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. కాస్త తలనొప్పిగా ఉంది అంతే. బిర్యానీ తిని నిద్రపోతే అదే ఫిక్స్ అవుతుంది. మీ అందరికీ నా ప్రేమను పంపిస్తున్నా. ఈ వార్తతో ఎవరూ స్ట్రెస్ అవ్వొద్దు’ అని ట్వీట్ చేశారు.
News October 6, 2025
ఇది ధర్మాన్ని అతిక్రమించడమే: పవన్

AP: CJI గవాయ్పై లాయర్ దాడికి యత్నించడాన్ని Dy.CM పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ‘ప్రజల మనోభావాలను అర్థం చేసుకోగలను. కానీ ఇది ధర్మాన్ని అతిక్రమించడమే. చట్టానికి కట్టుబడి ఉండడమే సనాతన ధర్మం. పాషన్తో కాదు ప్రాసెస్తోనే న్యాయం జరుగుతుందని మన పురాతన గ్రంథాల్లో ఉంది. లక్షలాది మంది సనాతనీలకు అవమానం కలిగించే ప్రతి చర్యకు మేం వ్యతిరేకం. CJI గౌరవానికి జనసేన మద్దతుగా నిలుస్తుంది’ అని ట్వీట్ చేశారు.