News November 27, 2024
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూ.196 కోట్లు రిలీజ్

TG: రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ.196 కోట్లు విడుదల చేసింది. ఇళ్ల నిర్మాణం పూర్తయినా తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి వసతుల కొరత ఉంది. ఈ విషయమై స్థానిక నాయకుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కాగా మౌళిక వసతులు పూర్తి చేయాల్సిన ఇళ్లు ఇంకా 40 వేలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 15, 2025
డాక్టర్ డ్రెస్లో ఉగ్రవాది

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు నిందితుడు, జైషే మహమ్మద్ ఉగ్రవాది ఉమర్ డాక్టర్ డ్రెస్లో ఉన్న ఫొటో బయటకు వచ్చింది. మెడలో స్టెతస్కోప్ వేసుకుని కనిపించాడు. కాగా ఈనెల 10న జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. NIA, ఇతర భద్రతా సంస్థలు ఉమర్ నెట్వర్క్ గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఉమర్ ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యుడిగా పని చేసేవాడు.
News November 15, 2025
ఇలాంటి ఫుడ్ రోజూ తింటే..

రెడీ టు ఈట్ ఫుడ్స్ను తరుచూ తీసుకుంటే 50 ఏళ్లలోపు వారిలో పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ‘రోజుకు మూడుసార్లు ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేవారితో పోల్చితే 10సార్లు తినే మహిళల్లో అడెనోమా(క్యాన్సర్ కాని కణతులు) ముప్పు 45% ఎక్కువగా ఉంటుంది. ఇవే క్రమంగా క్యాన్సర్గా మారుతాయి’ అని USకు చెందిన JAMA ఆంకాలజీ పేర్కొంది. ఇందుకోసం 20 ఏళ్లలో 30వేల మందిపై సర్వే చేసినట్లు తెలిపింది.
News November 15, 2025
ప్రహరీ బయట మొక్కలను పెంచకూడదా?

పాదచారుల బాటపై 2, 3 వరుసల్లో మొక్కలు పెంచడం సరికాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పచ్చదనం పెంచడం మంచిదే అయినా, ఇది పాదచారుల కోసం వదలాల్సిన స్థలాన్ని ఆక్రమిస్తుందంటున్నారు. ‘ఆ ప్రదేశం దాటి వాహనాలు నిలిపితే దారి మూసుకుపోతుంది. ఇంటి ప్రాంగణంలోనే మొక్కలు పెంచి, బయట పాదబాటలను నిర్విఘ్నంగా ఉంచడం ద్వారా వాస్తు శుభాలు, సామాజిక శ్రేయస్సు రెండూ కలుగుతాయి’ అని ఆయన సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


