News February 1, 2025
అకౌంట్లోకి రూ.20,000.. కీలక ప్రకటన

AP: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రాయచోటి సభలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. పెన్షన్లు పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపామన్న ఆయన ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద రూ.20వేలు మే నెలలో అందిస్తామన్నారు. అలాగే తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ప్రకటించారు.
Similar News
News December 4, 2025
ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఫేక్: పోలీసులు

TG: డిసెంబర్ 13న ట్రాఫిక్ చలాన్లపై 100% వరకు తగ్గింపు అంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని హైదరాబాద్ సిటీ పోలీసులు Xలో స్పష్టం చేశారు. ఇప్పటివరకు అలాంటి ప్రకటన ఏమీ చేయలేదని తెలిపారు. అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు. ఎల్లప్పుడూ పోలీస్ హ్యాండిల్స్ను చెక్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా పలు రాష్ట్రాల్లో అదే రోజున లోక్ అదాలత్ నిర్వహిస్తుండడంతో ఈ ప్రచారం జరిగినట్లు తెలుస్తోంది.
News December 4, 2025
జుట్టు త్వరగా పెరగాలంటే ఇవి తినండి

ప్రస్తుతకాలంలో పోషకాహార లోపంతో జుట్టు సమస్యలు పెరుగుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఆకుకూరలు, నట్స్, సీడ్స్, కోడిగుడ్లు, చేపలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. వీటిల్లో ఉండే క్యాల్షియం, ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, విటమిన్ డి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయంటున్నారు. అలాగే దాల్చిన చెక్కను ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు పెరుగుదలకు ఎంతో దోహదం చేస్తుందని చెబుతున్నారు.
News December 4, 2025
విశాఖకు మరిన్ని డేటా సెంటర్లు

AP: విశాఖకు మరిన్ని డేటా సెంటర్లు రాబోతున్నాయి. ప్రముఖ IT సంస్థ కంట్రోల్-ఎస్ విశాఖలో 350MW డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీంతో పాటు మరో 2 కంపెనీలు నిన్న విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు స్థలాలు పరిశీలించాయి. భూములపై కంపెనీలు సానుకూల ప్రతిపాదనలిస్తే క్యాబినెట్ భేటీలో కేటాయింపులపై ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇప్పటికే గూగుల్ 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.


