News November 21, 2024
పంత్కు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు? ఎందుకంటే?

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ ఐపీఎల్ మెగా వేలంలో రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు పలుకుతారని రైనా, ఉతప్ప, చోప్రా వంటి మాజీలు జోస్యం చెబుతున్నారు. కాగా ఒకే ఒక ప్రయోజనం కోసమే పంత్కు భారీ డిమాండ్ ఉందని తెలుస్తోంది. పంత్ ఓ గన్ ప్లేయర్, వికెట్ కీపర్ కూడా. ప్రస్తుతం ఆయన వయసు 27 ఏళ్లే. దీంతో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అతడిని దక్కించుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News October 29, 2025
ప్రజలు తినే పంటలు పండిస్తే మంచిది: CBN

AP: రాయలసీమలో వరికాకుండా ఇతర పంటలు పండిస్తున్నారని, కోస్తాలో కూడా తినేరకాలు పండించాలని CBN రైతులకు సూచించారు. ‘పంటకు ఫలితం ఉండాలంటే తినే వాళ్లుండాలి. ప్రజలు తినని వాటిని పండిస్తే లాభమేంటి? ఇప్పటికే ధాన్యం వాడకం తగ్గిపోతోంది’ అని చెప్పారు. అలా చేయకుండా తనను ఎన్ని తిట్టినా ఫలితం లేదన్నారు. కార్బోహైడ్రేట్స్ ఉండే రైస్ తినకూడదని దానివల్లే అందరికీ షుగర్ అని అన్నారు. కోనసీమలో పంటల్ని CM పరిశీలించారు.
News October 29, 2025
మెదడు ఎదుగుదలలో తల్లిపాల పాత్ర

తల్లిపాలు బిడ్డ ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఎన్నో పోషకాలతో నిండి ఉండే తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తాయి. అయితే శిశువుల వివిధ దశల్లో మెదడు ఎదుగుదలకు అనుగుణంగా చనుబాలలోని పోషకాల మోతాదులు మారిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలినెలల్లో తల్లిపాలలో మేయో-ఇనాసిటోల్ పెద్దమొత్తంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది బిడ్డ మెదడులో నాడీఅనుసంధానాలకు తోడ్పడుతోంది.
News October 29, 2025
AUSతో తొలి 3 టీ20లకు నితీశ్ దూరం

టీమ్ఇండియా ఆల్రౌండర్ నితీశ్ కుమార్ ఆస్ట్రేలియాతో మూడు టీ20లకు దూరమయ్యారు. ఆయన గాయం నుంచి కోలుకునేందుకు కాస్త సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం ఆయన మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొంది. అయితే ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది వెల్లడించలేదు. ఆస్ట్రేలియాతో ఆడిలైడ్లో జరిగిన రెండో వన్డేలో నితీశ్ <<18098198>>గాయపడిన<<>> సంగతి తెలిసిందే.


