News January 14, 2025
గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000!

రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లో ఆస్పత్రికి చేరిస్తే ఇచ్చే రివార్డును కేంద్రం పెంచనుంది. గుడ్ సమరిటన్స్ (ఉత్తమ పౌరులు)కు ప్రస్తుతం ఇచ్చే ₹5వేలను ₹25వేలకు పెంచుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గాయపడ్డ గంటలో చికిత్స అందితే బాధితులు కోలుకునే అవకాశం ఎక్కువ. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. కేసులు, తదితర భయాలతో క్షతగాత్రులను చాలామంది ఆస్పత్రులకు తీసుకెళ్లట్లేదు.
Similar News
News January 23, 2026
వంటింటి చిట్కాలు

* పూరీలు తెల్లగా ఉండాలంటే వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ, జంతికల పిండిలో పాలు పోస్తే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి.
News January 23, 2026
859 పోస్టులు.. రేపటి నుంచే దరఖాస్తులు

TG: రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి(24వ తేదీ) నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, Jr.అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్ తదితర పోస్టులకు ఏడో తరగతి-డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. 18-46 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: https://tshc.gov.in
News January 23, 2026
దక్షిణ కోస్తా రైల్వే జోన్ చుట్టూ వివాదం!

AP: విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ బౌండరీస్ చుట్టూ వివాదం రాజుకుంటోంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం, జూరిడిక్షన్ అంశం చర్చనీయాంశమైంది. వాల్తేర్ డివిజన్ ఆదాయానికి కీలకమైన కొత్తవలస-కిరండల్ లైన్ను ఒడిశా పరిధికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. దీంతో స్వయం సమృద్ధి కలిగిన రైల్వే జోన్ కావాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


