News June 14, 2024

రూ.3 లక్షలు లంచం.. పారిపోతుండగా అరెస్ట్

image

TG: సీపీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివాదంలో ఉన్న ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అతను ఓ వ్యక్తితో రూ.15 లక్షలకు డీల్ చేసుకున్నారు. బాధితుడు తొలి విడతలో రూ.5 లక్షలు ఇచ్చాడు. రెండో విడతలో రూ.3 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అక్కడికి రావడంతో సుధాకర్ పారిపోయాడు. సినిమా స్టైల్‌లో అతడిని వెంబడించి అరెస్ట్ చేశారు.

Similar News

News October 15, 2025

అక్టోబర్ 30న శ్రీవారి పుష్పయాగం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనికి ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. పుష్పయాగం రోజున ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం వంటి ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్న వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం చేస్తారు. సాయంత్రం స్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.

News October 15, 2025

ఓ టెకీ.. నీ శరీరం కోరుకుంటోందిదే!

image

స్తంభించిన జీవనశైలితో ఎంతో మంది టెకీలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ‘నేచర్ సైన్స్ రిపోర్ట్స్’ అధ్యయనంలో తేలింది. ‘సమయానికి ఆహారం ఇవ్వవు. ఇచ్చినా ప్రాసెస్ చేయలేని జంక్ ఇస్తావ్. నిద్రలేక నేను కూడా అలసిపోయాను. నా మాటే వినకపోతే, నీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది’ అని టెకీ శరీరం హెచ్చరిస్తోంది. అందుకే ఇకనైనా రోజూ వ్యాయామం, నడకతో పాటు సరైన నిద్రాహారాలు ఉండేలా చూసుకోండి. SHARE IT

News October 15, 2025

ఓట్ల చోరీతో గెలిచింది బీఆర్ఎస్సే: శ్రీధర్

image

TG: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. అసలు ఓటు చోరీతో గెలిచిందే BRS పార్టీయని <<18006137>>కేటీఆర్<<>> వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. గతంలో MLC ఎన్నికల్లో ఓట్ల చోరీ చేసి గెలిచిందని ఆయన విమర్శించారు. అర్హత లేని విద్యార్థులను ఓటర్లుగా చేర్చారని ఆరోపించారు. మరోవైపు మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సమస్య ఉంటే పరిష్కారం చూపేందుకు పీసీసీ చీఫ్, CM ఉన్నారని తెలిపారు.