News July 20, 2024
బీజేపీ హయాంలో రూ.300 కోట్ల స్కామ్: డీకే శివకుమార్

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం హయాంలో రూ.300 కోట్ల స్కామ్ జరిగిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ‘ఫాదర్స్ ఆఫ్ కరప్షన్’ అని కామెంట్స్ చేశారు. యడియూరప్ప, బసవరాజు బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వాల హయాంలో ఈ కుంభకోణాలు జరిగాయని, వీటిపై విచారణ జరిపిస్తామని మీడియాతో చెప్పారు. స్కామ్ వివరాలను అసెంబ్లీలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


