News March 29, 2024
ఓటు వేయకపోతే రూ.350 ఫైన్.. నిజమేనా?

లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోని ఓటర్లకు ఎన్నికల సంఘం ఫైన్ వేస్తుంది. వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350లను డెబిట్ చేస్తుంది’ అని మెసేజ్ సారాంశం. దీనిపై కేంద్రానికి సంబంధించిన PIB FACTCHECK స్పందించింది. ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇలాంటి ఫేక్ మెసేజ్లను నమ్మొద్దని పేర్కొంది.
Similar News
News November 21, 2025
నేడు కామారెడ్డిలో జాబ్ మేళా

నిరుద్యోగుల కోసం ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శుక్రవారం కలెక్టరేట్లోని ఉపాధి కల్పనా కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమర్ తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు 6300057052, 7671974009 నంబర్లను సంప్రదించాలన్నారు.
News November 21, 2025
యాషెస్ సిరీస్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

యాషెస్ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
☛ AUS XI: ఖవాజా, వెదరాల్డ్, లబుషేన్, స్మిత్(C), హెడ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, లియాన్, బ్రెండన్ డాగెట్, బోలాండ్
☛ ENG XI: డకెట్, క్రాలే, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్(C), J స్మిత్, అట్కిన్సన్, కార్స్, ఆర్చర్, వుడ్
☛ LIVE: స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్
News November 21, 2025
iBOMMA రవి కేసును ఫ్రీగా వాదిస్తానన్న లాయర్.. తండ్రి ఏమన్నారంటే?

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును ఉచితంగా వాదించి అతన్ని బయటకు తీసుకొస్తానంటూ సలీమ్ అనే న్యాయవాది ముందుకొచ్చారు. విశాఖ జిల్లా పెదగదిలి సాలిపేటలో ఉంటున్న రవి తండ్రి అప్పారావును ఆయన కలిశారు. కేసును వాదించేందుకు కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని కోరగా తాను నిరాకరించినట్లు అప్పారావు తెలిపారు. తన ఆరోగ్యం సహకరించనందున కోర్టుల చుట్టూ తిరగలేనని చెప్పానన్నారు.


