News May 5, 2024
ఏప్రిల్ నుంచే రూ.4వేల పింఛన్: చంద్రబాబు

AP: అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే రూ.4వేల పింఛన్ అమలు చేస్తామని TDP చీఫ్ చంద్రబాబు ధర్మవరం సభలో ప్రకటించారు. ‘దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచుతాం. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24వేలు ఇస్తాం. పింఛన్ కోసం జగన్ వృద్ధులను పొట్టన పెట్టుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని EC సూచించినా.. మండుటెండలో సచివాలయానికి రావాలని ఇబ్బంది పెట్టారు. శవ రాజకీయాలు చేసే సీఎంను ఇంటికి పంపాలి’ అని పిలుపునిచ్చారు.
Similar News
News January 29, 2026
ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ కీలక సమావేశం

TG: అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1న హైదరాబాద్ రానున్నారు. 2న మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. సింగరేణి టెండర్ల వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా భేటీ జరగనుంది.
News January 29, 2026
ఈ సంకేతాలు ఉంటే కిడ్నీ సమస్యలు!

* ఎక్కువ/తక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం.
* ముఖం, పాదాల్లో వాపులు.
* నురుగు/గోధుమ రంగు/రక్తంతో మూత్రం రావడం.
* త్వరగా అలసిపోయినట్టు/అలసటగా అనిపించడం.
* కండరాల తిమ్మిర్లు.
* చర్మం పొడిబారడం, దురద పెట్టడం.
* ఊపిరి సరిగ్గా అందకపోవడం.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 29, 2026
50 పరుగుల తేడాతో భారత్ ఓటమి

విశాఖలో జరిగిన 4వ T20లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. ఒకానొక సమయంలో దూబె(65) చెలరేగి ఆడటంతో గెలుపు దిశగా పయనించింది. అతను ఔటవ్వగానే కావాల్సిన రన్రేట్ పెరిగిపోయి 50 పరుగుల తేడాతో ఓడింది. శాంట్నర్ 3, సోధీ, డఫీ చెరో 2 వికెట్లు తీశారు.


