News April 7, 2025

ఈ క్లాక్ టవర్ కోసం రూ.40 లక్షలు ఖర్చు!

image

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా బిహార్ ప్రభుత్వం నిర్మించిన ‘క్లాక్ టవర్’పై విమర్శలొస్తున్నాయి. రూ.40 లక్షల వ్యయంతో షరీఫ్‌లో నిర్మించగా ఇది పక్షుల కోసం ఏర్పాటు చేసిన గూడులా కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ముందుగా నిర్దేశించిన మోడల్‌కు విరుద్ధంగా దీనిని నిర్మించగా, ప్రస్తుతం క్లాక్ కూడా పనిచేయట్లేదు. కాగా బ్రిటీషర్లు నిర్మించిన క్లాక్ టవర్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.

Similar News

News April 10, 2025

అమెరికా వెళ్లే చైనీయులకు బీజింగ్ హెచ్చరికలు

image

అమెరికాలో ప్రయాణిస్తున్న, ప్రయాణించనున్న తమ దేశస్థులకు చైనా హెచ్చరికల్ని జారీ చేసింది. ‘అమెరికా-చైనా బంధం బలహీనపడటం, అమెరికా దేశీయ భద్రత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని USకి ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలి’ అని స్పష్టం చేసింది. అమెరికా, చైనా ప్రస్తుతం తీవ్రస్థాయి సుంకాల యుద్ధంలో ఉన్న సంగతి తెలిసిందే. చైనాపై మొత్తం సుంకాల్ని ట్రంప్ ఈరోజు 125శాతానికి పెంచారు.

News April 10, 2025

ALERT: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..?

image

బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారికి నిబంధనల్ని మరింత కఠినం చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఎంత రుణం జారీ చేయాలన్నదాని నుంచి తీసుకున్న నగదును ఎలా వినియోగించాలి, రుణం తీర్చని బంగారాన్ని సంస్థలు ఎలా వేలం వేయాలి అన్న అంశాల వరకు అనేక అంశాలపై RBI విధివిధానాల్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ప్రకటన అనంతరం ముత్తూట్, IIFL, మణప్పురం, చోళమండలం సంస్థల షేర్లు పతనమయ్యాయి.

News April 10, 2025

పనిచేయకున్నా జీతం ఇస్తోన్న గూగుల్.. ఎందుకంటే?

image

తమ కంపెనీలోని టాలెంటెడ్ ఉద్యోగులను ప్రత్యర్థులు లాగేసుకోకుండా ఉండేందుకు గూగుల్ కాస్త తెలివిగా ఆలోచించింది. మార్కెట్‌లో Aiలో పోటీతత్వం పెరగడంతో ‘Google DeepMind’ అంటూ ఉద్యోగులతో ఒప్పందం చేసుకుంటోంది. దీనిపై సంతకాలు చేసిన వారికి ఏడాది వరకైనా పని చేయకపోయినా కంపెనీ జీతం ఇస్తుంటుంది. ఈ నిర్ణయం వీరు ఇతర కంపెనీలకు వెళ్లకుండా చేస్తుంది. అయితే దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!