News July 25, 2024

రూ.48 లక్షల కోట్లు ఏపీకే ఇచ్చారా?: విజయసాయిరెడ్డి

image

ఏపీ కోసమే ఎన్డీఏ బడ్జెట్ కేటాయించినట్లు గొప్పలు చెప్పుకోవడం దారుణమని YCP MP విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. ‘బడ్జెట్‌లోని మొత్తం రూ.48 లక్షల కోట్లు ఏపీకే ఇచ్చారా? ఆ రాష్ట్రానికే మొత్తం నిధులు ఇచ్చినట్లు ఇండియా కూటమి ఏడుస్తోంది. రూ.15 వేల కోట్లు ఏపీకి అప్పుగా మాత్రమే ఇచ్చింది. ఆ అసలు, వడ్డీని ఆ రాష్ట్ర ప్రజలే తిరిగి కట్టాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News December 9, 2025

నేషనల్ కెమికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

image

పుణేలోని CSIR-నేషనల్ కెమికల్ లాబోరేటరీలో 34 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12 నుంచి జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టెక్నీషియన్‌కు నెలకు రూ.40వేలు, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.72,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: http://recruit.ncl.res.in/

News December 9, 2025

చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే: పేర్ని నాని

image

AP: వ్యవసాయం, ధాన్యాగారంగా APకి ఉన్న బ్రాండును దెబ్బతీసింది CM చంద్రబాబేనని మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రైతును గుడ్డికన్నుతో చూడటం చంద్రబాబు విధానం. ఆయన ఎప్పటికీ రైతు వ్యతిరేకే. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. 18నెలల్లోనే రూ.2.66లక్షల కోట్ల అప్పుచేశారు. అప్పులు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? దేశ GDPలో AP వాటా ఎంత?’ అని ప్రశ్నించారు.

News December 9, 2025

విచిత్రమైన కారణంతో డివోర్స్ తీసుకున్న జంట!

image

వంటల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకపోవడంపై మొదలైన గొడవ 22 ఏళ్ల వివాహబంధాన్ని ముంచేసింది. ఈ విచిత్రమైన ఘటన అహ్మదాబాద్‌లో(GJ) జరిగింది. 2002లో పెళ్లి చేసుకున్న ఓ జంట 2013లో విడాకుల కోసం కోర్టుకెక్కింది. పూజల కారణంతో భార్య ఉల్లి, వెల్లుల్లిని వంటల్లో నిషేధించగా భర్త వేయాలని పట్టుబట్టాడు. దశాబ్ద కాలం పోరాటం తర్వాత 2024లో కోర్టు విడాకులను ఖరారు చేసింది. తాజాగా హైకోర్టు భార్య పిటిషన్‌ను కొట్టేసింది.