News October 5, 2024

ఖైదీల అసహజ మరణాలకు రూ.5 లక్షల పరిహారం

image

AP: జైళ్లలో ఖైదీలు మరణిస్తే ఇచ్చే పరిహారంపై రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఘర్షణ, జైలు సిబ్బంది వేధింపులతో ఖైదీ మరణిస్తే కుటుంబీకులకు రూ.5 లక్షలు అందిస్తారు. జైలు అధికారులు, వైద్యుల నిర్లక్ష్యంతో ఖైదీ చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా రూ.3.5 లక్షలు చెల్లిస్తారు. సహజ మరణం, అనారోగ్యం, తప్పించుకుని పారిపోయి చనిపోతే ఈ పరిహారం వర్తించదు. జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిబంధనలు రూపొందించారు.

Similar News

News October 5, 2024

ఆన్‌లైన్ బెట్టింగ్.. 2 కుటుంబాలు బలి

image

ఆన్‌లైన్ బెట్టింగ్ కుటుంబాల్లో విషాదం నింపుతోంది. తెలంగాణలోని వడ్డేపల్లి(నిజామాబాద్)లో హరీశ్ అనే యువకుడు రూ.50 లక్షలకుపైగా కోల్పోయాడు. పేరెంట్స్ పొలం అమ్మినా అప్పు తీరకపోవడంతో ముగ్గురూ ఉరివేసుకున్నారు. ఏపీలోని గంగాధర నెల్లూరు(చిత్తూరు)లో దినేశ్ రూ.కోటి పోగొట్టుకున్నాడు. ఆ మొత్తాన్ని తీర్చలేక తల్లిదండ్రులు, అక్కతోపాటు పురుగుమందు తాగాడు. పేరెంట్స్ చనిపోగా, అక్క, సోదరుడు చికిత్స పొందుతున్నారు.

News October 5, 2024

TENTH: రెండు రోజులపాటు సైన్స్ ఎగ్జామ్

image

TG: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జనరల్ సైన్స్ పేపర్‌ను రెండు రోజులపాటు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను ఇప్పటివరకు ఒకే రోజు నిర్వహిస్తూ వచ్చారు. ఇక నుంచి వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పేపర్‌కు ఎప్పటిలాగే 1.30hrs సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత టెన్త్‌ పేపర్లను 11నుంచి 6కు కుదించిన సంగతి తెలిసిందే.

News October 5, 2024

WARNING: ఈ నంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దు!

image

పాకిస్థాన్ నుంచి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. +92తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దంటున్నారు. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫొటోలను డీపీగా పెట్టుకుని చీట్ చేస్తారని, నమ్మితే మోసపోతారని హెచ్చరిస్తున్నారు. ఆగ్రాకు చెందిన ఓ మహిళను ఇలాగే మోసగించడంతో <<14268213>>ఆమె<<>> గుండెపోటుతో మరణించింది. >>SHARE IT