News October 5, 2024
ఖైదీల అసహజ మరణాలకు రూ.5 లక్షల పరిహారం

AP: జైళ్లలో ఖైదీలు మరణిస్తే ఇచ్చే పరిహారంపై రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఘర్షణ, జైలు సిబ్బంది వేధింపులతో ఖైదీ మరణిస్తే కుటుంబీకులకు రూ.5 లక్షలు అందిస్తారు. జైలు అధికారులు, వైద్యుల నిర్లక్ష్యంతో ఖైదీ చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా రూ.3.5 లక్షలు చెల్లిస్తారు. సహజ మరణం, అనారోగ్యం, తప్పించుకుని పారిపోయి చనిపోతే ఈ పరిహారం వర్తించదు. జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిబంధనలు రూపొందించారు.
Similar News
News November 17, 2025
భక్తులకు గుడ్న్యూస్.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు

AP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వేస్ ప్రకటించింది. రేపట్నుంచి జనవరి 21 వరకు ఈ రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్స్ ప్రతి మంగళవారం విశాఖ-కొల్లం(08539), ప్రతి బుధవారం కొల్లం-విశాఖ(08540) మధ్య స్లీపర్, 2AC, 3AC బోగీలతో నడవనున్నాయి. ఇవి రాజమండ్రి, VJA, నెల్లూరు, రేణిగుంట మీదుగా వెళ్తాయి. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ కూడా అందుబాటులో ఉంది.
News November 17, 2025
భక్తులకు గుడ్న్యూస్.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు

AP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వేస్ ప్రకటించింది. రేపట్నుంచి జనవరి 21 వరకు ఈ రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్స్ ప్రతి మంగళవారం విశాఖ-కొల్లం(08539), ప్రతి బుధవారం కొల్లం-విశాఖ(08540) మధ్య స్లీపర్, 2AC, 3AC బోగీలతో నడవనున్నాయి. ఇవి రాజమండ్రి, VJA, నెల్లూరు, రేణిగుంట మీదుగా వెళ్తాయి. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ కూడా అందుబాటులో ఉంది.
News November 17, 2025
వాట్సాప్లోనే ‘మీ సేవ’లు!

TG: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పదేపదే మీ-సేవ సెంటర్లకు వెళ్లకుండా ఆ సేవలన్నీ వాట్సాప్ ద్వారానే అందించనుంది. మీ-సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం అందుకు సంబంధించిన అన్ని అప్డేట్స్ వాట్సాప్లోనే చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ ఆమోదం పొందిందా? లేదా? అప్రూవ్ అయితే సర్టిఫికెట్ను వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రేపు ఈ సేవలను లాంచ్ చేయనున్నారు.


