News October 25, 2024
రూ.100తో రూ.5 లక్షల బీమా: టీడీపీ
AP: ఈ నెల 26 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించేందుకు TDP ఏర్పాట్లు చేస్తోంది. రూ.100 సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమా ఇవ్వనున్నారు. అలాగే సభ్యుడి కుటుంబసభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం కూడా సాయం అందిస్తారని తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. కష్టపడ్డవారికే పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Similar News
News October 25, 2024
పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇలా చేయండి
* రోజు ఫిజికల్ యాక్టివిటీ చేయించండి. గేమ్స్ ఆడేలా ప్రోత్సహించండి.
* పోషకాలతో కూడిన సమతుల ఆహారం ఇవ్వండి
* శీతల పానీయాలను నియంత్రించండి
* ఆహారం, స్నాక్స్ తినే విషయంలో సమయపాలన అలవాటు చేయండి
* నెమ్మదిగా, నమిలి తినడం నేర్పించండి
* మొబైల్, టీవీ స్క్రీన్ టైమ్ పరిమితం చేయండి
* వయసును బట్టి రోజుకు 9-11 గంటలు నిద్రపోయేలా చూడండి.
News October 25, 2024
విరాట్ కోహ్లీ చెత్త రికార్డు
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. టెస్టుల్లో అత్యధికంగా 47 సార్లు సింగిల్ డిజిట్కే పరిమితమైన ఏడో ప్లేయర్గా ఆయన నిలిచారు. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆయన ఒక్క రన్ మాత్రమే చేశారు. ఈ క్రమంలో టామ్ లాథమ్(47)ను సమం చేశారు. ఈ జాబితాలో క్రెగ్ బ్రాత్వైట్ (65) టాప్లో ఉండగా, ఆ తర్వాత రూట్ (64), కరుణరత్నే (51), స్టోక్స్ (50), విలియమ్సన్ (48) ఉన్నారు.
News October 25, 2024
SHOCKING: షుగర్, బీపీలా 8 కోట్ల మందికి గ్యాంబ్లింగ్ డిజార్డర్
డిజిటల్ విప్లవం అనేక మార్పులతో పాటు కొన్ని రోగాల్నీ తెచ్చిపెట్టింది. అందుకిదే ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా 8కోట్ల మంది గ్యాంబ్లింగ్ డిజార్డర్ లేదా జూదరోగంతో బాధపడుతున్నారని లాన్సెట్ తెలిపింది. ఆన్లైన్ క్యాసినో, గేమ్స్, బెట్టింగ్ మార్కెట్లే ఇందుకు కారణమంది. ఈజీ మనీ పేరుతో పిల్లలు, పెద్దలు వీటికి ఆకర్షితులవుతున్నారని పేర్కొంది. మొత్తంగా 44 కోట్ల మందికి గ్యాంబ్లింగ్ రిస్క్ ఉన్నట్టు వెల్లడించింది.