News September 7, 2024
డిగ్రీ చదివిన వారికి నెలకు రూ.5 వేలు.. బ్యాంకుల ఆఫర్!

డిగ్రీ పూర్తి చేసిన 25 ఏళ్లలోపు వయసు గలవారిని బ్యాంకులు త్వరలో అప్రెంటీస్లుగా నియమించుకొని నెలకు రూ.5 వేలు స్టైఫండ్ ఇవ్వనున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రకటన మేరకు గ్రాడ్యుయేట్స్కు ఇంటర్న్షిప్పై కార్పొరేట్ వ్యవహారాల శాఖ బ్యాంకులతో సమావేశమైంది. మరో నెల రోజుల్లో బ్యాంకులు ఈ నియామకాలు ప్రారంభించవచ్చని ఓ అధికారి తెలిపారు. ఏ బ్యాంకు ఎంత మందికి అవకాశం కల్పిస్తుందో తేలాల్సి ఉంది.
Similar News
News February 2, 2026
కాంగ్రెస్ ప్రభుత్వ పెట్టుబడులన్నీ కట్టుకథలే: కవిత

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులన్నీ కట్టు కథలేనని జాగృతి చీఫ్ కవిత విమర్శించారు. ‘సింగపూర్ గేట్వే సంస్థకు వెబ్సైటూ లేదు. ₹70వేల CR పెట్టుబడి అన్న ఇన్ఫ్రా కీ డేటా సెంటర్ పార్క్ కంపెనీ USలో ₹90వేల CR, బ్రెజిల్లో ₹70వేల CRకు MOU చేసింది. గతేడాదే ఏర్పాటైన ఇది MOUల కోసమే పుట్టినట్లుంది. జయవీర్ రెడ్డి కంపెనీ నిజమైనదో కాదో చెప్పాలి. ₹10L లేని కంపెనీలు ₹వేలకోట్ల MOUలు చేశాయి’ అని అన్నారు.
News February 2, 2026
Budget: గోల్డ్ బాండ్స్ ఇకపై ట్యాక్స్ ఫ్రీ కాదా?

బడ్జెట్లో గోల్డ్ బాండ్ల పన్ను మినహాయింపును కుదించారు. ఇకపై RBI ఈ బాండ్లను ఇష్యూ చేసినప్పుడే నేరుగా కొని మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటేనే పన్ను ఉండదు. ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఇతరుల దగ్గర కొనుగోలు చేస్తే మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభంపై కచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. అలాగే మెచ్యూరిటీ కంటే ముందు అమ్మినా పన్ను తప్పదు. అయితే ఏటా వచ్చే 2.5% వడ్డీపై పాత పద్ధతిలోనే పన్ను వర్తిస్తుంది.
News February 2, 2026
అభిషేక్ శర్మపై రికీ పాంటింగ్ ప్రసంశలు

T20 WCలో భారత స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా నిలుస్తాడని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం T20 నంబర్ వన్ ర్యాంకర్గా ఉన్న అభిషేక్, తన మెరుపు బ్యాటింగ్తో భారత్ను విజేతగా నిలుపుతాడని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. భారత్, శ్రీలంక వేదికలుగా FEB 7 నుంచి మొదలవనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి.


