News August 22, 2024

తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షలు: సీఎం

image

AP: అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి ₹50లక్షలు ఆర్థిక సాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సాధారణంగా గాయపడిన వారికి ₹25లక్షలు ఇస్తామన్నారు. మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం వారి కుటుంబీకులతో ఆయన మాట్లాడారు. వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. కాగా మృతుల కుటుంబాలకు ₹కోటి చొప్పున ఇస్తామని కలెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News February 13, 2025

ఏ క్షణమైనా నన్ను చంపేయొచ్చు: లావణ్య

image

TG: అమ్మాయిల జీవితాలతో మస్తాన్ సాయి ఆడుకున్నాడని హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఆరోపించారు. ‘పదుల సంఖ్యలో అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేశాడు. ఏ క్షణమైనా నన్ను చంపేయొచ్చు. ప్రతిక్షణం భయంతో బతుకుతున్నా. నాకేం జరిగినా మస్తాన్ సాయి కుటుంబానిదే బాధ్యత. జీవితం, నా మనిషిని కోల్పోయా. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని సారీ చెప్పాలనుకుంటున్నా. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దు’ అని లావణ్య అన్నారు.

News February 13, 2025

రంగరాజన్‌పై దాడి.. కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు

image

TG: రంగరాజన్‌పై దాడి కేసుకు సంబంధించి పోలీసుల కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘10 నెలల క్రితమే రంగరాజన్‌ను రామరాజ్యం రాఘవరెడ్డి కలిసి తమ సంస్థకు మద్దతు తెలపాలని కోరారు. తమకు రిక్రూట్మెంట్ చేయడంతో పాటు ఆర్థిక సాయం చేయాలన్నాడు. రాఘవరెడ్డి ప్రతిపాదనను రంగరాజన్ ఒప్పుకోలేదు. ఈ అక్కసుతోనే దాడికి ప్లాన్ చేసిన రాఘవరెడ్డి 22 మందితో చిలుకూరు వెళ్లాడు’ అని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు.

News February 13, 2025

మోహన్ బాబుకు ముందస్తు బెయిల్

image

జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు ఊరట దక్కింది. ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

error: Content is protected !!