News September 17, 2024
ఈ ఖరీఫ్ నుంచే వడ్లకు రూ.500 బోనస్: మంత్రి ఉత్తమ్

TG: సన్న వడ్లకు క్వింటాపై ₹500 బోనస్ ఈ ఖరీఫ్ నుంచే ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని చెప్పారు. వరి సాధారణ రకానికి ₹2,300, ఏ-గ్రేడుకు ₹2,320 మద్దతు ధర ఉండగా, ₹500 బోనస్ కలిపి రైతులకు అందజేయనున్నారు. 18 రకాల సన్న రకం ధాన్యానికి ఈ బోనస్ వర్తించనుంది. దొడ్డు రకానికీ బోనస్ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News December 7, 2025
డ్రగ్స్తో పట్టుబడితే 20 ఏళ్ల జైలు: రవికృష్ణ

AP: సరదాల కోసం డ్రగ్స్కు అలవాటుపడి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని ఈగల్ IG రవికృష్ణ సూచించారు. ‘డ్రగ్స్ వాడుతూ పట్టుబడితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఉద్యోగ అవకాశం కోల్పోతారు. జీవితాంతం దేశంలో ఎక్కడ ఉన్నా పోలీసు నిఘా ఉంటుంది. అనుమానం వస్తే తిరిగి జైలు తప్పదు’ అని హెచ్చరించారు. పిల్లలు డ్రగ్స్కు అలవాటుపడకుండా పేరెంట్స్ చూడాలన్నారు. డౌట్ వస్తే ‘1972’ నంబర్కి చెబితే రక్షించుకోవచ్చని తెలిపారు.
News December 7, 2025
స్మృతి మంధాన పెళ్లి రద్దు.. ఏం జరిగింది?

తన ప్రియుడు పలాశ్ ముచ్చల్తో నిశ్చితార్థం జరిగినట్లు స్మృతి మంధాన నవంబర్ 20న ప్రకటించారు. అదే నెల 23న పెళ్లి జరగాల్సి ఉండగా, స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది. ఆమె ప్రియుడు కూడా అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత అతడు వేరే అమ్మాయితో చాటింగ్ చేసినట్లు ఉన్న స్క్రీన్ షాట్లు వైరలయ్యాయి. పెళ్లి రద్దయినట్లు స్మృతి తాజాగా <<18495850>>ప్రకటించారు<<>>. అయితే కారణాన్ని వెల్లడించలేదు.
News December 7, 2025
వీటిని తింటే కళ్లద్దాల అవసరమే రాదు

ప్రస్తుత రోజుల్లో చిన్నారులను సైతం కంటి చూపు సమస్యలు వేధిస్తున్నాయి. పోషకాహార లోపమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. రోజూ క్యారెట్, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, చిలకడదుంపలు తినిపిస్తే Vitamin A సమృద్ధిగా లభిస్తుంది. చేపలు, వాల్నట్స్, అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. క్యాప్సికం, బ్రోకలీ వంటి ఆహారాలు కూడా కంటి నరాలకు మేలు చేస్తాయి.


