News October 26, 2024
సన్న వడ్లకు రూ.500 బోనస్.. క్యాబినెట్ ఆమోదం
TG: సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ములుగులో సమ్మక్క-సారలమ్మ వర్సిటీకి భూకేటాయింపునకు మంత్రివర్గం ఆమోదించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంచాలని నిర్ణయించింది. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Similar News
News October 26, 2024
చైనాతో ఒప్పందం ఎలా సాధ్యమైందంటే..: ఎస్ జైశంకర్
తూర్పు లద్దాక్లోని వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ ఉపసంహరణ విషయంలో చైనా, భారత్ మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రెండు అంశాలు ఆ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. ‘మన సైన్యం అత్యంత కష్టమైన పరిస్థితుల్లోనూ పట్టుదలతో నిలబడింది. ఒప్పందం వెనుక భారత సైన్యమే తొలి కారణం. ఇక సరిహద్దు వెంబడి దశాబ్దకాలంగా మనం అభివృద్ధి చేసుకున్న మౌలిక వసతులు రెండో కారణం’ అని వివరించారు.
News October 26, 2024
కొంకణ్ తీరాన్ని ఏలేది ఎవరు?
మహారాష్ట్రలోని కొంకణ్ తీర ప్రాంతంలో 75 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక్కో దశలో ఒక్కో పార్టీ తన ప్రాభవాన్ని చాటిన ఈ ప్రాంతంలో ఇప్పుడు 2 కూటములు, 6 పార్టీలు ఉనికి కోసం పోటీ పడుతున్నాయి. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట ఇప్పుడు పార్టీల చీలికలతో బీజేపీ, శివసేన, NCPల గుప్పెట్లో ఉంది. అయితే, కాంగ్రెస్తో కలసి గత వైభవాన్ని చాటేందుకు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
News October 26, 2024
మినీ మేడారం జాతర తేదీలు ఖరారు
TG: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2025 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. మినీ మేడారం జాతరకు సైతం భక్తులు భారీగా తరలివస్తారు. గద్దెల వద్ద పొర్లుదండాలు పెడతారు. సారె చీరలు, బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అయితే పెద్ద జాతరలా అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు.