News February 7, 2025
టాటా ఆస్తిలో రూ.500 కోట్లు.. ఎవరీ మోహన్ దత్తా?
వ్యాపార దిగ్గజం రతన్ టాటా తన వీలునామాలో రూ.500 కోట్లు మోహినీ మోహన్ దత్తా అనే వ్యక్తికి రాశారు. ఆ పేరు తాజాగా బయటికి రావడంతో ఆయన ఎవరన్న ఆసక్తి నెలకొంది. ఝార్ఖండ్లోని జంషెడ్పూర్కు చెందిన దత్తా ఒకప్పుడు స్టాలియన్ అనే ట్రావెల్ ఏజెన్సీకి యజమాని. దాన్ని టాటా గ్రూప్లో కలిపేశారు. టాటాతో మోహన్కు 60 ఏళ్ల స్నేహముందని జంషెడ్పూర్వాసులు చెబుతుంటారు. ఆ స్నేహంతోనే భారీ మొత్తాన్ని ఇచ్చారని తెలుస్తోంది.
Similar News
News February 7, 2025
సీఎంతో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ
AP: సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం ఇవాళ సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2047- విజన్ డాక్యుమెంట్పై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.
News February 7, 2025
మీ డ్రీమ్స్లోనూ ఇవే వస్తుంటాయా?
మన దగ్గర ఎక్కువ మంది కలలో పాము కనిపించిందని చెప్తుంటారు. అయితే, దేశాలను బట్టి వారి డ్రీమ్స్లో వచ్చేవి కూడా మారుతాయని ఓ అధ్యయనంలో తేలింది. అర్జెంటీనాలో ఎక్కువ మందికి స్పైడర్స్, AUS & కెనడా వారికి పళ్లు ఊడిపోయినట్లు, బంగ్లాదేశ్ ప్రజలకు పెళ్లి జరిగినట్లు కలలొస్తాయి. ఫ్రాన్స్ ప్రజలకు తమ మాజీ గర్ల్ఫ్రెండ్ డ్రీమ్స్లోకి వస్తుందని చెప్పారు. బ్రెజిల్ & ఆస్ట్రియా వాళ్ల డ్రీమ్స్లో మోస్ట్ కామన్ పామే.
News February 7, 2025
పాక్ ఫుట్బాల్ ఫెడరేషన్ను సస్పెండ్ చేసిన ఫిఫా
పాకిస్థాన్ ఫుట్బాల్ ఫెడరేషన్(PFF)ను ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్(FIFA) సస్పెండ్ చేసింది. నిబంధనలను పాటించడంలో విఫలమైందని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. PFFలో సజావుగా ఎన్నికల నిర్వహణ, గ్రూపిజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా 2019లో నార్మలైజేషన్ కమిటీని ఫిఫా ఏర్పాటు చేసింది. కానీ సత్ఫలితాలు రాలేదు. దీంతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2017 నుంచి PFF సస్పెన్షన్కు గురికావడం ఇది మూడోసారి.