News October 3, 2024

రూ.5600 కోట్ల డ్రగ్స్ మాస్టర్ మైండ్‌కు కాంగ్రెస్‌తో కనెక్షన్: పోలీసులు

image

ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్‌పై ఇన్వెస్టిగేషన్లో ఓ కీలక విషయం బయటపడింది. రూ.5600 కోట్ల విలువైన కొకైన్ షిప్‌మెంట్ మాస్టర్ మైండ్‌ తుషార్ గోయల్ తనకు కాంగ్రెస్‌తో కనెక్షన్ ఉందని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు 2021లో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ RTI సెల్‌ ఛైర్మన్‌గా పనిచేసినట్టు చెప్పారన్నారు. దుబాయ్‌లోని ఓ బడా వ్యాపారి ఈ కొకైన్‌కు మెయిన్ సప్లయర్ అని తెలుసుకున్నట్టు పేర్కొన్నారు.

Similar News

News November 2, 2025

లండన్ పర్యటనలో CM చంద్రబాబు దంపతులు

image

AP: CM చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి లండన్‌ పర్యటనకు వెళ్లారు. ఈనెల 5 వరకు ఈ వ్యక్తిగత పర్యటన కొనసాగనుంది. ఈనెల 4న భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డును అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ స్వీకరించనున్నారు. అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను CII సదస్సుకు ఆహ్వానిస్తారు.

News November 2, 2025

తిరుమలలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థానం

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి వాహన సేవను నిర్వహించనున్నారు. మలయప్పస్వామి శ్రీదేవీ, భూదేవీ సమేతంగా మాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఈ వాహన సేవ ఉ.6-7.30 గంటల మధ్య జరగనుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.

News November 2, 2025

శుభ కార్యాలు చేసేటప్పుడు పట్టు వస్త్రాలను ఎందుకు ధరించాలి?

image

శుభకార్యాలు చేసేటప్పుడు పట్టు వస్త్రాలు ధరించడానికి వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. సృష్టిలో ప్రతి ప్రాణి చుట్టూ ‘ఓరా’ అనే సప్తవర్ణ కాంతి పుంజం ఉంటుందట. పట్టు వస్త్రాలు ధరించినప్పుడు ఇది మరింత శక్తివంతంగా మారుతుందట. పట్టు వస్త్రాలు చుట్టూ ఉన్న ఈ సానుకూల శక్తిని ఆకర్షించి, మన శరీరమంతటా ప్రసరించేలా చేస్తుందట. అందుకే పెళ్లిళ్లు, పూజాది క్రతువులు, దేవాలయ దర్శనాల్లో పట్టు వస్త్రాలు ధరించడం ఆనవాయితీ.