News October 3, 2024
రూ.5600 కోట్ల డ్రగ్స్ మాస్టర్ మైండ్కు కాంగ్రెస్తో కనెక్షన్: పోలీసులు

ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్పై ఇన్వెస్టిగేషన్లో ఓ కీలక విషయం బయటపడింది. రూ.5600 కోట్ల విలువైన కొకైన్ షిప్మెంట్ మాస్టర్ మైండ్ తుషార్ గోయల్ తనకు కాంగ్రెస్తో కనెక్షన్ ఉందని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు 2021లో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ RTI సెల్ ఛైర్మన్గా పనిచేసినట్టు చెప్పారన్నారు. దుబాయ్లోని ఓ బడా వ్యాపారి ఈ కొకైన్కు మెయిన్ సప్లయర్ అని తెలుసుకున్నట్టు పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
జూబ్లీహిల్స్ EXIT POLLS.. BRS, కాంగ్రెస్ వార్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో మంగళవారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్పై BRS, కాంగ్రెస్ నేతల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. చాణక్య స్ట్రాటజీస్, HMR,నాగన్న, జనమైన్, స్మార్ట్ పోల్,ఆరా మస్తాన్ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించగా మిషన్ చాణక్య, క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ BRS గెలుస్తుందని చెప్పాయి. దీంతోNOV 14న దేఖ్లేంగే అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. మీ కామెంట్?
News November 12, 2025
ఆస్పత్రిలో చేరిన మరో సీనియర్ నటుడు

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద(61) ముంబై క్రిటికేర్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న దిగ్గజ నటుడు ధర్మేంద్రను నిన్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన గోవింద ఇంట్లో రాత్రి సమయంలో కుప్పకూలిపోయారు. దీంతో అర్ధరాత్రి ఒంటిగంటకు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ తెలిపారు. ఆయనకు పలు టెస్టులు చేశారని, వాటి రిజల్ట్స్ వస్తే అనారోగ్యానికి కారణం తెలుస్తుందన్నారు.
News November 12, 2025
రేపు విచారణ.. ఇవాళ క్షమాపణ!

TG: నాగార్జున ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖ మరోసారి <<18263475>>క్షమాపణలు<<>> చెప్పడం చర్చకు దారితీసింది. సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై రేపు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అందుకే ఆమె ఒకరోజు ముందు ఆయనకు సారీ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ ‘సారీ’ని స్వీకరించి నాగార్జున కేసును వెనక్కి తీసుకుంటారా? లేక ముందుకే వెళ్తారా? అనేది రేపు తేలనుంది.


