News February 1, 2025

బడ్జెట్‌లో పోలవరానికి రూ.5,936 కోట్లు

image

AP: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం సవరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.30,436.95 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్‌లో పోలవరానికి రూ.5,936 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మరో రూ.54 కోట్లు కేటాయించింది. 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వను ఆమోదించింది.

Similar News

News October 18, 2025

7,565 కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3రోజులే ఉంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. 18-25 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. <>వెబ్‌సైట్:<<>> https://ssc.gov.in/

News October 18, 2025

ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెళ్లికి ముందే కౌన్సెలింగ్

image

TG: వివాహబంధాల్లో పెరుగుతున్న ఘర్షణలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 33 జిల్లాల్లో ఇప్పటికే ఉన్న సఖీ, వన్ స్టాప్ కేంద్రాల్లో రూ.5 కోట్ల వ్యయంతో వీటిని పెట్టనుంది. ప్రతి సెంటర్‌లో లీగల్ కౌన్సెలర్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్, హెల్పర్ ఉంటారు. వివాహబంధంలోకి అడుగుపెట్టాలనుకునే వారు వీటిల్లో కౌన్సెలింగ్ తీసుకోవచ్చు.

News October 18, 2025

రాయలసీమ, దక్షిణ కోస్తాకు భారీ వర్షసూచన

image

AP: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో బంగాళాఖాతం మీదుగా గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడనుందని, దీంతో రేపట్నుంచి వర్షాలు పెరిగే ఆస్కారముందని చెప్పింది.