News April 1, 2025
పాఠశాల విద్యకు రూ.620 కోట్లు నిధులు

AP: పాఠశాల విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ దాదాపు రూ.620 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత విద్యాసంవత్సరంలో సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ ద్వారా ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యతో పాటు ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు నిర్వహించారు. వాటికి అయిన ఖర్చులకే తాజాగా నిధులు మంజూరయ్యాయి.
Similar News
News April 2, 2025
ఐసీసీ ర్యాంకింగ్స్: చరిత్ర సృష్టించాడు!

NZ బౌలర్ డఫీ ICC T20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచారు. ఈక్రమంలో ఆ దేశం తరఫున ఏ ఫార్మాట్లోనైనా అగ్రస్థానం దక్కించుకున్న తొలి ఫాస్ట్ బౌలర్గా చరిత్ర సృష్టించారు. బౌలర్లలో వరుణ్ 3వస్థానంలో, ఆల్రౌండర్లలో పాండ్య అగ్రస్థానంలో నిలిచారు. భారత ఆటగాళ్ల ర్యాంకులు చూస్తే..
T20 Batting: అభిషేక్-2, తిలక్-4, సూర్య-5
ODI Batting: గిల్-1, రోహిత్-3, కోహ్లీ-5, శ్రేయర్-8
ODI Bowling: కుల్దీప్-3, జడేజా-9
News April 2, 2025
భారత రిచెస్ట్ ఉమెన్ ఎవరంటే?

ఫోర్బ్స్-2025 ప్రకారం OP జిందాల్ గ్రూప్ అధినేత్రి సావిత్రి జిందాల్($35.5 బిలియన్లు) భారత రిచెస్ట్ ఉమెన్గా నిలిచారు. ఓవరాల్గా IND టాప్-10 బిలియనీర్లలో సావిత్రి ఒక్కరే మహిళ కావడం విశేషం. తొలి స్థానంలో అంబానీ($92.5 బి.), రెండో స్థానంలో అదానీ($56.3 బి.), మూడో ప్లేస్లో సావిత్రి ఉన్నారు. ఆమె భర్త ఓంప్రకాశ్ స్థాపించిన జిందాల్ గ్రూప్ స్టీల్, విద్యుత్, సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు విస్తరించింది.
News April 2, 2025
దైవం మనుష్య రూపేణ.. మహేశ్పై ప్రశంసలు!

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్బాబు ఉచితంగా వైద్యం చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఫౌండేషన్ 4500కు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేయించింది. తాజాగా పుట్టుకతోనే గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు చిన్నారులకు విజయవంతంగా ఆపరేషన్ చేయించినట్లు పేర్కొంది. ఇందులో ఒకరికి రెండేళ్లు, మరొకరికి నాలుగు నెలలు మాత్రమే. దీంతో మహేశ్ది గొప్ప మనసంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.