News December 30, 2024

75 రోజుల్లో రూ.6,312 కోట్ల మద్యం తాగేశారు

image

AP: రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ ప్రకటించిన తర్వాత అమ్మకాలు జోరందుకున్నాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 మధ్య 75 రోజుల్లోనే రూ.6,312 కోట్ల విలువైన లిక్కర్ సేల్ అయినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 83,74,116 కేసుల లిక్కర్, 26,78,547 కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది. ఇవాళ, రేపు, జనవరి 1న మద్యం అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేసింది.

Similar News

News December 5, 2025

మోదీ-పుతిన్ మధ్య స్పెషల్ మొక్క.. ఎందుకో తెలుసా?

image

హైదరాబాద్ హౌస్‌లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పాల్గొనగా.. వీరి మధ్య ఉంచిన ఓ మొక్క అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ మొక్క పేరు హెలికోనియా. ముఖ్యమైన చర్చలు జరిగేటప్పుడు దీనిని ఉంచడం శుభ సూచకంగా భావిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటానికి & అభివృద్ధికి సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News December 5, 2025

14,967 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. DEC 4తో గడువు ముగియగా.. DEC 11 వరకు పొడిగించారు. ఇప్పటివరకు అప్లై చేసుకోని వారు చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.

News December 5, 2025

PHOTO GALLERY: మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

image

AP: రాష్ట్రంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజయవంతంగా ముగిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. పిల్లలకు పాఠాలు చెప్పి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ఫొటోలు దిగారు. అటు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.