News July 29, 2024
వారంలో రైతుల ఖాతాల్లోకి రూ.680 కోట్లు: అచ్చెన్నాయుడు

AP: వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. ఉభయగోదావరి జిల్లాల్లో దెబ్బతిన్న వరి పొలాలను ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొని రూ.1,680 కోట్లు బకాయిలు పెట్టిందని విమర్శించారు. వారం రోజుల్లో రూ.680 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం నుంచి భీమవరం వరకు ఎర్రకాలువను అభివృద్ధి చేస్తామన్నారు.
Similar News
News November 25, 2025
హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి: సిద్దరామయ్య

CM మార్పు విషయంలో గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందని, వారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు. అధిష్ఠానం నుంచి సిగ్నల్ రాగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు తాను పార్టీ నుంచి ఏమీ డిమాండ్ చేయడం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.
News November 25, 2025
UIDAIలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(<
News November 25, 2025
ఆకుకూరల సాగు- అనువైన నేలలు, వాతావరణం

తక్కువ సమయంలో రైతు చేతికొచ్చి, నిరంతరం ఆదాయం అందించే పంటల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరలను మురుగు నీరు ఇంకిపోయే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6.0 నుంచి 7.5గా ఉండాలి. వానాకాలం, వేసవి కాలం, 16 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న సమయం ఆకుకూరల పంటలు పెరగడానికి అత్యంత అనుకూలం. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే తోటకూరను సాగు చేయడం కష్టం.


