News August 19, 2025
రూ.7.50 లక్షల ప్రశ్న.. జవాబు చెప్పండి!

గత వారం కౌన్ బనేగా కరోడ్పతి షోలో క్రికెట్కు సంబంధించి పలు ప్రశ్నలు వచ్చాయి. హోస్ట్ అమితాబ్ రూ.7.50 లక్షలకు IPLపై ఓ ప్రశ్న అడిగారు.
Q: ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు పర్పుల్ క్యాప్ గెలవని ప్లేయర్ ఎవరు?
A. లసిత్ మలింగ B. హర్షల్ పటేల్
C. డ్వేన్ బ్రావో D. భువనేశ్వర్ కుమార్
>> సరైన జవాబు ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News August 19, 2025
చైనాలో తైవాన్ భాగమేనని భారత్ చెప్పిందా?

చైనాలో తైవాన్ భాగమేనని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారని చైనా అధికారిక మీడియా Xinhua పేర్కొంది. నిన్న చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీతో భేటీలో ఈ మేరకు జైశంకర్ వ్యాఖ్యానించారని తెలిపింది. మరోవైపు తైవాన్ విషయంలో భారత స్టాండ్లో ఎలాంటి మార్పు లేదని, దౌత్య సంబంధాలు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై భారత్ అధికారికంగా ప్రకటిస్తేనే క్లారిటీ రానుంది.
News August 19, 2025
పద్మజ మరణంపై సీఎం చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి

నందమూరి జయకృష్ణ భార్య పద్మజ <<17450773>>మృతిపై<<>> ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. పద్మజ మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ఘటన తమ కుటుంబంలో విషాదం నింపిందని తెలిపారు. కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచిన అత్త ఆకస్మిక మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని లోకేశ్ పేర్కొన్నారు.
News August 19, 2025
తీరం దాటిన వాయుగుండం.. భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తెల్లవారుజామున తీరం దాటినట్లు APSDMA తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, ఉత్తరాంధ్రలోని కృష్ణా, ఏలూరు, అల్లూరి, వైజాగ్, ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.