News August 16, 2024
1.8KM దూరానికి రూ.700.. నెటిజన్ పోస్టు వైరల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1723784053143-normal-WIFI.webp)
క్యాబ్ సర్వీసులు ఇష్టానుసారం రేట్లు పెంచి ప్రయాణికులను దోచుకోవడం సర్వసాధారణమైంది. ఈ వ్యవహారంపై ఓ నెటిజన్ చేసిన పోస్టు వైరలవుతోంది. ‘ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర సంస్థలు తక్కువ ధరతో సర్వీస్ అందిస్తామని చెబుతుంటాయి. అయితే కొన్ని వర్షపు చినుకులు రాలగానే 300% అధికంగా డిమాండ్ చేస్తాయి. ఢిల్లీలో 1.8KMల దూరానికి కారు సర్వీసుకు ఏకంగా రూ.699 రేటు చూపుతోంది’ అని అతను రాసుకొచ్చారు.
మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా?
Similar News
News February 9, 2025
ఇందిరమ్మ ఇళ్లు.. వారి ఖాతాల్లోకి రూ.లక్ష?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739057229665_893-normal-WIFI.webp)
TG: ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడతలో 4.5L మందిని ఎంపిక చేస్తారని, లబ్ధిదారుల జాబితాను ఇన్ఛార్జ్ మంత్రులు ఫైనల్ చేయగానే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలుస్తోంది. ఫస్ట్ ఫేజ్లో లబ్ధిదారులకు ₹లక్ష చొప్పున జమవుతాయని సమాచారం. దీనిపై సర్కార్ ప్రకటన చేయాల్సి ఉంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
News February 9, 2025
అత్యాశ.. ఉన్నదీ పోయింది!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739059315306_653-normal-WIFI.webp)
కేంద్రంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించాలన్న అత్యాశే ఆప్ కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 3 సార్లు ఢిల్లీ ప్రజలు అధికారం ఇవ్వడం, ఆ తర్వాత పంజాబ్లోనూ పాగా వేయడంతో చక్రం తిప్పాలని కేజ్రీవాల్ భావించారు. ‘ఇండియా’ కూటమి నుంచి దూరమై నేరుగా మోదీపైనే విమర్శలు చేస్తూ దేశప్రజల దృష్టిని ఆకర్షించాలని చూశారు. ఈక్రమంలోనే అవినీతి ఆరోపణల కేసులు, ఢిల్లీలో పాలన గాడి తప్పడంతో ప్రజలు ఓటుతో ఊడ్చేశారు.
News February 9, 2025
వేడి వాతావరణం.. పెరగనున్న ఉష్ణోగ్రతలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739057648204_893-normal-WIFI.webp)
AP: వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొందని, నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా రికార్డయినట్లు తెలిపింది. నందిగామలో వరుసగా ఐదో రోజు అత్యధికంగా 37.6 డిగ్రీలు నమోదైంది.